AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమలం ఆకర్షకు సర్వే బ్రేక్..

తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ కమల్ కొనసాగుతోంది. కాంగ్రెస్, టీడీపీలో ఉన్న సీనియర్ నేతలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఆయా పార్టీల్లో సీనియర్స్‌గా ఉండి.. పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్‌గా లేని నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎవరు వచ్చినా డోర్స్ ఓపెన్ అన్న విధంగా తన ప్రణాళికను నడిపిస్తోంది. ఇది వరకే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న బీజేపీ.. అదే ఊపుతో ఇప్పుడు తెలంగాణపై కన్నేసింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోని సీనియర్ నేతలను టార్గెట్ […]

కమలం ఆకర్షకు సర్వే బ్రేక్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2019 | 1:39 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ కమల్ కొనసాగుతోంది. కాంగ్రెస్, టీడీపీలో ఉన్న సీనియర్ నేతలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఆయా పార్టీల్లో సీనియర్స్‌గా ఉండి.. పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్‌గా లేని నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎవరు వచ్చినా డోర్స్ ఓపెన్ అన్న విధంగా తన ప్రణాళికను నడిపిస్తోంది. ఇది వరకే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న బీజేపీ.. అదే ఊపుతో ఇప్పుడు తెలంగాణపై కన్నేసింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోని సీనియర్ నేతలను టార్గెట్ చేసింది.

ఇప్పటికే పలువురు నేతలతో జరిపిన చర్చలు సక్సెస్‌ అయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో మంత్రులుగా పనిచేసిన బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలతో బీజేపీ సీనియర్స్‌ మంతనాలు జరిపినట్లు వార్తలు వచ్చాాయి. అయితే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమని వచ్చిన వార్తలను సర్వే సత్యనారాయణ ఖండించారు. రాహుల్ ని ప్రధాని చేయడమే తన లక్ష్యమని చెప్పిన ఆయన.. కావాలనే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వదంతులను రేపుతున్నారని మండిపడ్డారు. తనను బీజేపీ నేతలు ఎవరూ సంప్రదించలేదని ఆయన తెలిపారు. అటు బలరాం నాయక్ కూడా తాను ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా, బీజేపీ హైకమాండ్‌తో టచ్‌లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడో, రేపో కాషాయ కండువాను కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.