ఇంట్లో నుంచి ఘాటైన వాసన.. అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం.. వాటర్ ట్యాంక్ చెక్ చేయగా షాక్!
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి భర్త అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని వాటర్ ట్యాంక్లో దాచిపెట్టాడు నిందితుడు.
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి భర్త అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని వాటర్ ట్యాంక్లో దాచిపెట్టాడు నిందితుడు. బిలాస్పూర్ సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్లాపూర్ దగ్గర జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అయితే, హత్య జరిగిన రెండు నెలల తర్వాత ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో భర్త.. హత్య చేశాడని.. ఆ తర్వాత డెడ్బాడీని టేపుతో చుట్టేసి వాటర్ ట్యాంక్లో దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు.
ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ట్యాంక్లో నుంచి సాతి సాహు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంబంధాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్యానేరం కింద మహిళ భర్త పవన్సింగ్ ఠాకూర్ను పోలీసులు అరెస్టు చేశారు.
Chhattisgarh | A man, Pavan Thakur detained for allegedly killing his wife Sati Sahu, chopping her off into pieces & dumping them in a water tank in his house in Uslapur, Bilaspur on suspicions of infidelity. Body recovered, Police say it may have been dumped 1-2 months ago. pic.twitter.com/Phb7cERD8Z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 6, 2023
అయితే, మహిళ మృతదేహం సింటెక్స్ నీటిలో 6 ముక్కలై లభ్యమైంది. ప్రసుత్తం పోలీసుల అదుపులో ఉన్న పవన్ సింగ్ ఠాకూర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బిలాస్పూర్ పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..