AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Accident: బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం..!

Bus Accident: ఉత్తరాఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అందరిని కలిచివేసింది. ఉత్తరకాశీ జిల్లా దుమ్టాలో ఓ బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో..

Bus Accident: బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం..!
Subhash Goud
|

Updated on: Jun 06, 2022 | 5:17 AM

Share

Bus Accident: ఉత్తరాఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అందరిని కలిచివేసింది. ఉత్తరకాశీ జిల్లా దుమ్టాలో ఓ బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు చేరింది. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బస్సు లోయలో పడిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్​ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు సరైన వైద్యంతో పాటు మృతదేహాలను రాష్ట్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్​ ధామీకి ఫోన్​ చేసి వివరాలు తెలుసుకున్నారు.

ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

ఇవి కూడా చదవండి

ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.

మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం- సీఎం శివరాజ్

మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకు రూ.50,000 ప్రకటించింది. రాత్రికి డెహ్రాడూన్ బయల్దేరి వెళ్లారు. సీఎంతో పాటు ఉన్నత స్థాయి వ్యక్తుల బృందం కూడా ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన యాత్రికులు యమునోత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అక్కడ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి