AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: ఏ క్షణంలోనైనా ఆ రాష్ట్రంలో తీవ్ర భూకంపం.. టర్కీ కంటే దారుణ పరిణామాలు

ఉత్తరాఖండ్‌లో భూగర్భంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా, టర్కీ కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించవచ్చు. హిమాలయ ప్రాంతం మొత్తం దీని పరిధిలో ఉంది. అయితే.. ఈ భూకంపం ఏర్పడే సమయం గురించి ఎటువంటి అంచనా వేయబడలేదు.

Earthquake: ఏ క్షణంలోనైనా ఆ రాష్ట్రంలో తీవ్ర భూకంపం.. టర్కీ కంటే దారుణ పరిణామాలు
Earthquake In Uttarakhand
Surya Kala
|

Updated on: Feb 21, 2023 | 9:18 AM

Share

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ దుర్ఘటన ఇంకా మనసునించి కనుమరుగుకాలేదు. తాజాగా శాస్త్రవేత్తలు మరో భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖండ్ కు మరోప్రమాదం పొంచి ఉందని.. అది టర్కీ, సిరియా లో ఏర్పడిన భూకంపంకంటే అధికం అని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు హెచ్చరిక జారీ చేశారు. టర్కీ తరహా భూకంపం ఉత్తరాఖండ్‌లో కూడా రావచ్చని అన్నారు. శాస్త్రవేత్తల  హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ప్రజలకు నిద్ర పట్టని రాత్రులు ఏర్పడ్డాయి.

ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉపరితలం కింద చాలా ఉద్రిక్తత ఏర్పడిందని ఎన్.పూర్ణచంద్రరావు చెప్పారు.  ఈ ఉద్రిక్తత తొలగిపోవాలంటే భారీ భూకంపం రావాల్సి ఉంటుందని.. అప్పుడే ఈ ఉద్రిక్తత తొలగిపోతుందని అన్నారు. అయితే ఎన్.పూర్ణచంద్రరావు చెప్పిన విషయాన్నీ ప్రస్తావిస్తూ.. భూకంపం వచ్చే తేదీ , సమయాన్ని అంచనా వేయలేమని TOI నివేదిక రాసింది. ప్రకృతి సృష్టించే విధ్వంసం.. అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని..ఎందుకనే ఒక భౌగోళిక ప్రాంతానికి.. మరొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.

GPS ద్వారా కార్యాచరణ: ఉత్తరాఖండ్‌ను దృష్టిలో ఉంచుకుని హిమాలయ ప్రాంతంలో దాదాపు 80 సీస్మిక్ స్టేషన్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు భూకంపం ఏర్పడే నిజ సమయాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. చాలా కాలంగా ఒత్తిడి పెరుగుతోందని మా డేటా చూపిస్తుంది. మేము ప్రాంతంలో GPS నెట్‌వర్క్‌లను కలిగి ఉన్నాము. GPS పాయింట్లు కదులుతున్నాయి.. ఇవి ఉపరితలం క్రింద జరుగుతున్న మార్పులను సూచిస్తున్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఖచ్చితమైన సమయం ఇంకా అంచనా వేయబడలేదు భూమికి ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వేరియోమెట్రిక్ GPS డేటా ప్రాసెసింగ్ నమ్మదగిన పద్ధతుల్లో ఒకటి అని శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు చెప్పారు. మేము ఖచ్చితమైన సమయం.. తేదీని అంచనా వేయలేము.. అయితే ఉత్తరాఖండ్‌లో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించవచ్చు. వేరియోమీటర్లు భూమి అయస్కాంత క్షేత్రంలో వైవిధ్యాలను కొలుస్తున్నాయని తెలిపారు.

మరో రెండు నెలల్లో చార్ ధామ్ యాత్ర  బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాల ప్రవేశ ద్వారంగా భావించే జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో ఇప్పుడు ణి శాస్త్రవేత్త వ్యాఖ్యలతో మళ్ళీ భయాందోళనలు నెలకొన్నాయి. మరో రెండు నెలల్లో చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ సమయంలో..  లక్షల మంది యాత్రికులు ఉత్తరాఖండ్ పర్వతాలకు వస్తారు. జమ్మూకశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న హిమాలయ ప్రాంతంలో 8 తీవ్రత కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పుడు ఇప్పుడు ఏర్పడిన టర్కీ, సిరియా దేశాలకంటే దారుణమైన పరిస్థితులు ఏర్పడవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధ్వంసాన్ని అంచనా వేయడం కష్టం నష్టం అనేక పారామితులపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్త చెప్పారు. జనసాంద్రత, భవనాల రూపకల్పన, పర్వతాలు లేదా మైదానాలలో నిర్మాణ నాణ్యత వంటివి. మొత్తం హిమాలయ ప్రాంతం భూకంపాలకు గురవుతుంది.. ఈ ప్రాంతం గతంలో 1720 కుమావోన్ భూకంపం, 1803 గర్హ్వాల్ భూకంపంతో సహా నాలుగు ప్రధాన భూకంపాలను చూసింది. హిమాలయాల శ్రేణి భారతదేశ భూకంప జోనింగ్ మ్యాప్‌లోని జోన్ V , జోన్ IVలో వస్తుంది. ఈ ప్రాంతం గత 100 సంవత్సరాల్లో 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఉన్న భూకంపాలు ఏర్పడలేదు. అయితే, 1991 – 1999లో, ఉత్తరకాశీ, చమోలీ ప్రాంతాలు రెండు తక్కువ-తీవ్రత కలిగిన భూకంపాలకు గురయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..