AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలు తొలగిపోనున్నాయ్..

భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్(ఏటీవీఎం) నుంచి అన్ రిజర్వ్‌డ్ టికెట్ కొనుగోలు చేసేందుకు..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలు తొలగిపోనున్నాయ్..
Atvm
Shiva Prajapati
|

Updated on: Feb 21, 2023 | 10:53 AM

Share

భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్(ఏటీవీఎం) నుంచి అన్ రిజర్వ్‌డ్ టికెట్ కొనుగోలు చేసేందుకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. సౌత్ రైల్వే పరిధిలో ఆరు డివిజన్లలో 254 అప్‌గ్రేడ్ ఏటీవీఎం లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా ప్రయాణీకులు UPI లేదా QR కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా టిక్కెట్ ఛార్జీని చెల్లించవచ్చు. ఈ వెసులుబాటు ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం.. ప్రయాణీకులు తమ స్మార్ట్ కార్డ్‌ల R-వాలెట్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా మాత్రమే టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్, తాంబరంతో సహా అనేక ప్రధాన స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు భారీగా క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. డబ్బులు చెల్లించే విషయంలోనే ఆలస్యం ఎక్కువగా అవతుండటంతో ఇదే అంశంపై అనేక ఫిర్యాదులు అందాయి. దాంతో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ అప్‌గ్రేడ్ చేసిన ఏటీవీఎం కియోస్క్ స్క్రీన్‌పై ప్రయాణికులు తమ ప్రయాణ మార్గాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత.. ప్రయాణికులు యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. అదే సమయంలో ప్రయాణికులు తమ స్మార్ట్ కార్డులను కూడా ఉపయోగించవచ్చు.

కాగా, టికెట్ కౌంటర్లలో రద్దీని తగ్గించే లక్ష్యంతో ఎనిమిదేళ్ల క్రితం రైల్వే శాఖ ఏటీవీఎంలను ప్రవేశపెట్టింది. చెన్నై డివిజన్‌లో మొత్తం 34 ఏటీవీఎంలు, దక్షిణ రైల్వేలోని మరో ఐదు డివిజన్లలో 65 ఏటీవీఎంలు పనిచేస్తున్నాయి. చెన్నై సబర్బన్ నెట్‌వర్క్‌లోని నాలుగు విభాగాల ద్వారా రోజుకు 11.5 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నప్పటికీ.. ప్రయాణికులు తమ స్మార్ట్ కార్డులను రీచార్జ్ చేయకపోవడం వలన వెండింగ్ మెషీన్‌ల వినియోగం చాలా తక్కువైంది.

అప్‌గ్రేడ్ టికెట్ వెండింగ్ మెషీన్‌ ద్వారా లోకల్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ల కోసం అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. సీజన్ టిక్కెట్ హోల్డర్లు నెలవారీ, త్రైమాసిక పాస్‌లను పునరుద్ధరించుకోవచ్చు. అయితే, స్మార్ట్ కార్డ్ వినియోగం ప్రయాణీకులకు లాభదాయకంగా ఉంటుంది. రీఛార్జ్ మొత్తంలో 3% బోనస్ R-వాలెట్‌కు క్రెడిట్ చేయబడుతుంది.

254 ATVMలలో 96 చెన్నై డివిజన్‌లో రద్దీగా ఉండే స్టేషన్లలో ఏర్పాటు చేశారు. మిగిలిన యంత్రాలను తిరుచ్చి (12), మధురై (46), సేలం (12), తిరువనంతపురం (50), పాలక్కాడ్ (38) డివిజన్లలో అమర్చనున్నారు. టికెట్లు తమిళం, మలయాళం, ఇంగ్లీష్, హిందీలో ముద్రించబడి ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..