AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA Mega Crackdown: అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్‌ఐఏ దాడులు.. ఏజెన్సీ చేతిలో కీలక సమాచారం..

దేశంలో పలుచోట్ల ఎన్‌ఐఏ దాడులు చేపట్టింది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీ, చండీగఢ్‌, యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోని 70 చోట్ల ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు జరుగుతున్నాయి

NIA Mega Crackdown: అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్‌ఐఏ దాడులు.. ఏజెన్సీ చేతిలో కీలక సమాచారం..
NIA
Sanjay Kasula
|

Updated on: Feb 21, 2023 | 9:08 AM

Share

దేశంలో పలుచోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ( ఎన్ఐఏ)  దాడులు చేసింది. 70 ప్రాంతాలకుపైగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీ, చండీగఢ్‌, యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో సోదాలు చేసింది. అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్ఐఏ అధికారుల దాడులు నిర్వహించారు. గ్యాంగ్‌స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి ఎన్ఐఏ మరింత దూకుడు పెంచింది. ఈసారి 70కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. ఇందులో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్, అతని సన్నిహితుల దాచిన స్థలంలో టెర్రర్ ఫండింగ్ గురించి ఈ దాడి జరిగింది.

ఈ దాడి అన్ని ప్రదేశాలలో ఏకకాలంలో నిర్వహించింది ఎన్ఐఏ. ఈ దాడుల్లో ఆరుగురు గ్యాంగ్‌స్టర్లను విచారించగా.. ఇంకా చాలా మంది గ్యాంగ్‌స్టర్ల పేర్లు తెరపైకి వచ్చినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ప్రశ్నించిన గ్యాంగ్‌స్టర్ల ఇళ్లు, వారితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలపై, వారి సహచరులపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్‌స్టర్లకు ఇతర దేశాల్లో పరిచయాలు ఉన్నాయనే విషయం తెరపైకి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లారెన్స్ బిష్ణోయ్, బవానా గ్యాంగ్ పేరుతో భారత్‌లో ఉగ్రదాడులకు భారీగా నిధులు సమకూరుతున్నట్లుగా తేలింది.

గ్యాంగ్‌స్టర్ నెక్సస్‌పై చర్య

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద అరెస్టు చేసిన గ్యాంగ్‌స్టర్లందరినీ NIA విచారించింది. దీని తరువాత, పాకిస్తాన్-ఐఎస్ఐ, గ్యాంగ్‌స్టర్ నెక్సెస్ గురించి చాలా సమాచారం NIA చేతికి చిక్కింది. దీని ఆధారంగా గ్యాంగ్‌స్టర్ల రహస్య స్థావరాలపై మరోసారి దాడులు నిర్వహిస్తున్నారు.

ఏజెన్సీ చేతిలో కీలక సమాచారం

గ్యాంగ్‌స్టర్లను దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది. ఎన్‌ఐఏ వర్గాల అందించిన సమాచారం ప్రకారం, గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నిధుల కేసులో ఏజెన్సీ ఇప్పటి వరకు మూడు సార్లు దాడులు నిర్వహించింది. దీనికి ముందు కూడా, గత ఏడాది చివరిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం