AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstition: ఆ దేవత నీళ్ళు జల్లితే కరోనా రాదట..కోవిడ్ నిబంధనలు పక్కనపెట్టి గుంపులు కట్టిన ప్రజలు..

Superstition: ప్రజలకు అసలు భయం వేయడం లేదని అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఒక పక్క కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. రోజూ వేలాది మరణాలు దేశవ్యాప్తంగా సంభవిస్తున్నాయి.

Superstition: ఆ దేవత నీళ్ళు జల్లితే కరోనా రాదట..కోవిడ్ నిబంధనలు పక్కనపెట్టి గుంపులు కట్టిన ప్రజలు..
Superstition
KVD Varma
|

Updated on: Jun 03, 2021 | 7:34 PM

Share

Superstition: ప్రజలకు అసలు భయం వేయడం లేదని అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఒక పక్క కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. రోజూ వేలాది మరణాలు దేశవ్యాప్తంగా సంభవిస్తున్నాయి. ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలూ ప్రజల్ని రక్షించడం కోసం విపరీతంగా కష్టపడుతున్నాయి. కానీ, కొందరు ప్రజలు మాత్రం ఏమాత్రం కరోనా గురించి భయపడుతున్నట్టు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం కరోనా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెవిలో ఇల్లు కట్టుకుని పోరినట్టు చెబుతున్నా కొందరికి అస్సలు వినిపించడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుంటే..కొంత మంది మూర్ఖత్వం పై విపరీతమైన ఆగ్రహం వస్తుంది.

మధ్యప్రదేశ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒక గ్రామంలోని చిన్న ఆలయంలో అందించే పవిత్రజలం కరోనా అంటుకోకుండా కాపాడుతుంది అని పుకార్లు వచ్చాయి. అంతే ఇంకేముంది వందలాది మంది ఆ ఆలయానికి చేరుకున్నారు. ఒక్కరూ కూడా కనీస కరోనా జాగ్రత్తలు పాటించలేదు. ఈ విషయాన్ని గురువారం పోలీసులు మీడియాకు తెలియచేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ గడ్ జిల్లాలోని చతుఖేదా గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఒక మతపరమైన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం 150 మందికి పైగా గుంపులుగా హాజరయ్యారు. అక్కడ దేవత చేత ఆశీర్వదించబడిన ఒక మహిళ ఇచ్చిన ‘పవిత్ర జలం’ వైరల్ ఇన్‌ఫెక్షన్ నుండి తమను రక్షిస్తుందని వీరంతా అక్కడకు చేరుకున్నారు. ఈ వీడియో బుధవారం సాయంత్రం నుంచి వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రకారం, ఒక స్థానిక మహిళా పూజారి “పరి మాతా” అక్షరక్రమంలో ఉందని, ఆమె స్థానిక దేవత ఇచ్చిన పవిత్ర జలం చల్లి భక్తులకు కరోనా వ్యాధి సంక్రమించకుండా ఆశీర్వదిస్తుందని తెలిపింది. ఈ వీడియోలో, పెద్ద సంఖ్యలో ప్రజలు, ఎక్కువగా మహిళలు గ్రామంలోని ఒక ప్రదేశంలో నిలబడి కనిపించారు. వారిలో ఎక్కువ మంది మాస్క్ లు ధరించడం కానీ, సామాజిక దూర ప్రమాణాలను పాటించడం కానీ చేయలేదు.

తరువాత స్థానిక పట్వారీ (రెవెన్యూ స్టాఫ్) వీరేంద్ర పుష్పద్ ఫిర్యాదు మేరకు, ఖుజ్నర్ పోలీసులు ఆ ‘దేవతా’ మహిళ, అదేవిధంగా మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బదాంబాయి దర్జీ, వీరం ప్రజాపతి, రమేష్ కొత్వాల్, మంగీలాల్ ప్రజాపతి లపై ఐపిసి సెక్షన్లు 188, 269 మరియు 270 కింద అలాగే, సంబంధిత విభాగాలు విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు.

Also Read: Social Media: సోషల్ మీడియాలో వచ్చే అభ్యంతరకర పోస్టులపై ఇప్పుడు మీరు ఫిర్యాదు చేయవచ్చు.. ఎలా అంటే..

Corona Data: కరోనా ప్రతిరోజూ లెక్కల్లో మీరిది గమనించారా? ప్రతి సోమవారం కేసులు తక్కువగా కనిపిస్తాయి..ఎందుకంటె..