AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉరిశిక్షల విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐక్యరాజ్యసమితి

ఉరిశిక్షల విషయంపై ఐక్యరాజ్య సమితి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను నిలిపివేయాలని.. లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఈ ఉరిశిఓల అమలుపై స్పందించారు. ప్రపంచ దేశాలన్ని ఉరిశిక్షలను ఆపేయాలని ఆంటోనియా గ్యుటెరెస్ అన్నారు. ఒకవేళ శిక్షగా ఉరిశిక్ష వేసిఉంటే.. అలాంటి వాటిని శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలని కోరారు.ఇది ఐక్య రాజ్య సమితి నిర్ణయం […]

ఉరిశిక్షల విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐక్యరాజ్యసమితి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2020 | 8:17 PM

Share

ఉరిశిక్షల విషయంపై ఐక్యరాజ్య సమితి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను నిలిపివేయాలని.. లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఈ ఉరిశిఓల అమలుపై స్పందించారు. ప్రపంచ దేశాలన్ని ఉరిశిక్షలను ఆపేయాలని ఆంటోనియా గ్యుటెరెస్ అన్నారు. ఒకవేళ శిక్షగా ఉరిశిక్ష వేసిఉంటే.. అలాంటి వాటిని శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలని కోరారు.ఇది ఐక్య రాజ్య సమితి నిర్ణయం తీసుకుందని తెలిపారు.

కాగా.. శుక్రవారం తెల్లవారుజామున తీహార్ జైలులో నిర్భయ దోషులను నలుగురిని ఒకేసారి ఉరి తీసిన విషయం తెలిసిందే. ఈ శిక్ష అమలైన మరుసటి రోజే.. ఐక్య రాజ్య సమితి ఈ నిర్ణయం తీసుకుంది.ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి.. ఆమె మరణానికి కారణమైన ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లను శుక్రవారం తీహార్ జైలులో తెల్లవారు జామున 5.30 గంటలకు ఉరితీసఇన విషయం తెలిసిందే.