AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు సీఎం పళనిస్వామిని పరామర్శించిన రోజా

తమిళనాడు సీఎం పళనిస్వామిని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా పరామర్శించారు. పళనిస్వామి తల్లి తవసాయమ్మ గతవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే

తమిళనాడు సీఎం పళనిస్వామిని పరామర్శించిన రోజా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 21, 2020 | 9:19 AM

Share

RK Roja Palaniswami: తమిళనాడు సీఎం పళనిస్వామిని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా పరామర్శించారు. పళనిస్వామి తల్లి తవసాయమ్మ గతవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భర్త ఆర్కే సెల్వమణితో కలసి రోజా మంగళవారం గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పళని స్వామి ఇంటికి వెళ్లారు. తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించి, పళనిస్వామితో మాట్లాడి ఈ ఇద్దరు తమ సానుభూతిని తెలిపారు. కాగా ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, బీజేపీ నేత కుష్బూ, డీఎండీకే నేత సుదీప్‌, సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి కూడా మంగళవారం పళనిస్వామిని పరామర్శించారు.

Read More:

సుడిగాలి సుధీర్‌కి కరోనా పాజిటివ్‌..!

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,579 కొత్త కేసులు.. 5 మరణాలు