AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: కోరమండల్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. కీలక ప్రకటన చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.

Ashwini Vaishnaw: కోరమండల్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. కీలక ప్రకటన చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
Odisha Triple Train Tragedy
Sanjay Kasula
|

Updated on: Jun 04, 2023 | 7:08 PM

Share

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రైల్వే ట్రాక్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఓవర్‌హెడ్‌ వైర్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు కృషి చేస్తున్నారు. అదే సమయంలో క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. తదుపరి విచారణ కోసం మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. రెండు లైన్లలో ట్రాక్ మరమ్మతు పనులు దాదాపుగా పూర్తయ్యాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం (జూన్ 4) తెలిపారు.

ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. ఆసుపత్రుల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. అందరూ కలిసి రక్షించే పని చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు కృషి చేస్తున్నారు. భద్రక్‌లోని ప్రభుత్వాసుపత్రిలో దాదాపు రోగులందరూ వారి కుటుంబాలతో మాట్లాడినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.

అంతకుముందు, హౌరాను కలిపే డౌన్ లైన్ పునరుద్ధరించబడిందని ఆయన చెప్పారు. రైళ్ల కోసం కనీసం ఒక సెట్ ట్రాక్‌లు సిద్ధంగా ఉన్నాయని, అయితే బాలాసోర్ ప్రమాద స్థలంలో లూప్ లైన్‌లతో సహా అన్ని ట్రాక్‌లను సరిచేయడానికి మరింత సమయం అవసరమని రైల్వే అధికారులు చెబుతున్నారు. అంతకుముందు రోజు ఉదయం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో కలిసి శ్రీ రామ్ చంద్ర భంజ్ మెడికల్ కాలేజీని సందర్శించారు. అక్కడ చేరిన రోగులతో మాట్లాడి పరిస్థితిని వైద్యులతో చర్చించారు.

వీడియో కోసం ఇక్కడ చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం