AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: కోరమండల్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. కీలక ప్రకటన చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.

Ashwini Vaishnaw: కోరమండల్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. కీలక ప్రకటన చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
Odisha Triple Train Tragedy
Sanjay Kasula
|

Updated on: Jun 04, 2023 | 7:08 PM

Share

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రైల్వే ట్రాక్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఓవర్‌హెడ్‌ వైర్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు కృషి చేస్తున్నారు. అదే సమయంలో క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. తదుపరి విచారణ కోసం మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. రెండు లైన్లలో ట్రాక్ మరమ్మతు పనులు దాదాపుగా పూర్తయ్యాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం (జూన్ 4) తెలిపారు.

ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. ఆసుపత్రుల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. అందరూ కలిసి రక్షించే పని చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు కృషి చేస్తున్నారు. భద్రక్‌లోని ప్రభుత్వాసుపత్రిలో దాదాపు రోగులందరూ వారి కుటుంబాలతో మాట్లాడినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.

అంతకుముందు, హౌరాను కలిపే డౌన్ లైన్ పునరుద్ధరించబడిందని ఆయన చెప్పారు. రైళ్ల కోసం కనీసం ఒక సెట్ ట్రాక్‌లు సిద్ధంగా ఉన్నాయని, అయితే బాలాసోర్ ప్రమాద స్థలంలో లూప్ లైన్‌లతో సహా అన్ని ట్రాక్‌లను సరిచేయడానికి మరింత సమయం అవసరమని రైల్వే అధికారులు చెబుతున్నారు. అంతకుముందు రోజు ఉదయం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో కలిసి శ్రీ రామ్ చంద్ర భంజ్ మెడికల్ కాలేజీని సందర్శించారు. అక్కడ చేరిన రోగులతో మాట్లాడి పరిస్థితిని వైద్యులతో చర్చించారు.

వీడియో కోసం ఇక్కడ చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?