AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT: టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ఆటోమొబైల్ ప్రముఖులు..

భారతదేశ ఆటో రంగం వేగంగా మారుతోంది. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇండియా ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? మహీంద్రా వంటి కంపెనీ మొత్తం పోర్ట్‌ఫోలియోను ఎలా మారుస్తోంది? టీవీ9 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్‌లో ఇవన్నీ చర్చించబడతాయి.

WITT: టీవీ9 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ఆటోమొబైల్ ప్రముఖులు..
Tv9 Witt Summit
Srikar T
| Edited By: |

Updated on: Feb 24, 2024 | 5:35 PM

Share

భారతదేశ ఆటో రంగం వేగంగా మారుతోంది. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇండియా ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? మహీంద్రా వంటి కంపెనీ మొత్తం పోర్ట్‌ఫోలియోను ఎలా మారుస్తోంది? టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్‌లో ఇవన్నీ చర్చించబడతాయి. మారుతీ చైర్మన్ ఆర్. C. భార్గవ, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా ఈ ప్లాట్‌ఫామ్‎పై ప్రసంగించనున్నారు. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇండియా ఇందులో పాలుపంచుకుంటే తప్ప భారత ఆటో రంగంలో ఎలాంటి మార్పు జరగదు. ఎందుకంటే దేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నప్పుడు, మారుతి సుజుకి ఇండియా దానికి కొంత దూరంగా అడుగులు వేస్తోంది ఎందుకు..? అంతేకాకుండా హైబ్రిడ్ కార్లపై ఎక్కువ దృష్టి పెడుతోంది.. దీని వెనుక ఆయనకు ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా? అనే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దేశంలోని నంబర్-1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండవ ఎడిషన్‌లో దొరుకుతాయి.

భారతదేశంలో ప్రస్తుతం మారుతున్న ఆటో మొబైల్ పరిశ్రమల గురించి మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్.సి. భార్గవ, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ CEO అనీష్ షా నుండి సమాధానాలు రానున్నాయి. మారుతీ సుజుకి ఇండియా, ఆర్. సి.భార్గవ అనే పేర్లు ఇప్పుడు భారతదేశంలో దాదాపు ఒకదానికొకటి పర్యాయపదంగా మారాయి. ఈ కార్యక్రమంలో మారుతీ ఆటో మొబైల్ రంగానికి చెందిన సంభాషణ ఉంటుంది. కంపెనీ మొత్తం పోర్ట్‌ఫోలియోను మార్చే వ్యూహం, ఎలక్ట్రిక్ వాహనాలపై భవిష్యత్తు ప్రణాళిక, భారతదేశంలో దాని భవిష్యత్తు గురించి కూడా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన సీఈవో అనిష్ షాతో చర్చించనున్నారు.

ఆర్. సి.భార్గవ

మారుతీ సుజుకి ప్రస్తుత చైర్మన్, మాజీ సీఈవో ఆర్. సి. భార్గవ తన పదవీకాలంలో కొత్త శిఖరాలను అధిరోహించిన వ్యాపారవేత్తలలో ఒకరు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో దాదాపు 25 సంవత్సరాలు గడిపిన భార్గవ, మారుతీలో అత్యధిక కాలం పాటు అగ్రస్థానంలో ఉన్నారు. దాదాపు 90 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహం చూడాల్సిందే. అతను డూన్ స్కూల్, అలహాబాద్ యూనివర్శిటీ, మసాచుసెట్స్‌లోని విలియం కాలేజీలో తన చదువును పూర్తి చేశారు. WITT 2024లో ‘సస్టైనింగ్ ది మూమెంట్ అండ్ ది మొమెంటం’ అనే సెషన్‌లలో ప్రసంగించేందుకు సిద్దమయ్యారు.

ఇవి కూడా చదవండి

డాక్టర్ అనీష్ షా

మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పెద్ద ఆటో మొబైల్ కంపెనీకి చెందిన గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా కూడా WITTలో పాల్గొనబోతున్నారు. అతని సెషన్‌లో ఆటో మొబైల్ రంగంలో పెరుగుతున్న డిమాండ్, మహీంద్రా భవిష్యత్తు ప్రణాళికలు, ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుపై చర్చించే అవకాశం ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రాలో చేరడానికి ముందు, అనీష్ GE క్యాపిటల్ ఇండియాకు సీఈవోగా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, SBI కార్డ్‌తో GE జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడంలో అతని పాత్ర ముఖ్యమైనది. అనిష్ షా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ముంబైలోని సిటీ బ్యాంక్, బోస్టన్‌లోని బైన్ అండ్ కంపెనీకి చెందిన US డెబిట్ ప్రొడక్ట్స్‌లో కూడా పనిచేశారు. దేశంలోని ప్రముఖ పరిశ్రమల సంస్థ అయిన ఫిక్కీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us