AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్ ఇండియా థింక్స్ టుడే

వాట్ ఇండియా థింక్స్ టుడే

దేశ రాజధాని ఢిల్లీలో ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. భారతదేశపు నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ TV9 నిర్వహించనున్న ఈ సమ్మిట్‌లో దేశ రాజకీయాలు, పాలన, ఆర్థిక శాస్త్రం, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలతో సహా అనేక కీలక అంశాలు చర్చించబడతాయి. ఈ మూడు రోజుల సదస్సు ఫిబ్రవరి 25న ఆదివారంనాడు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు.

‘వాట్ ఇండియా థింక్స్ టుడే’లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, భూపేంద్ర యాదవ్, స్మృతి ఇరానీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌, నీతి ఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌ కాంత్‌ కూడా తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. దీంతో పాటు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ, ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ సహా కళారంగం, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు.

ఇంకా చదవండి

WITT 2025: టీవీ9 సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

WITT 2025: టీవీ9 నెట్‌వర్క్ 'వాట్ ఇండియా థింక్స్ టుడే' మూడవ ఎడిషన్ మార్చి 28న జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. హోటల్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. వందల మంది సమక్షంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీవీ9ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు..

WITT 2025: టోల్ టాక్స్‌పై వారంలో కీలక ప్రకటన.. టీవీ9తో నితిన్ గడ్కరీ

TV9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన WITT సమిట్‌లో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల గురించి వివరించారు. అలాగే టోల్ టాక్ గురించి ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే వారంలో టోల్ ఫీజుకు సంబంధించి ఒక పెద్ద ప్రకటన చేస్తానననారు.

WITT 2025: భారతదేశంలో గతంలో ఉన్న ఆదర్శవాదం ఇప్పుడు లేదుః రణదీప్ సుర్జేవాలా

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ఇటీవలి ఎన్నికల ఓటమి, భారత కూటమి భవిష్యత్తు, కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులపై కీలక అంశాలను వెల్లడించారు. 2025లో ఇండియా థింక్స్ టుడే అనే అంశంపై ఆయన చర్చించారు. పార్టీలోని సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, యువ నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

WITT 2025: అమేథీలో ఓటమికి అసలు కారణం ఇదే.. tv9 సమ్మిట్‌లో స్మృతి ఇరానీ

టీవీ9 మహామంచ్‌లో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అనేక అంశాలపై మాట్లాడారు. అమేథి ఎంపీగా ఉన్నప్పుడు చేసిన పని గురించి, ఆ తర్వాత అక్కడ ఎదుర్కొన్న ఓటమి గురించి ఆమె మాట్లాడారు. నాయకుడిని అయితే, సురక్షితమైన సీటు కోసం చూసేదానిని అని మాజీ కేంద్ర మంత్రి అన్నారు. నాయకుడిని అయితే, తదుపరి ఎన్నికల గురించి ఆందోళన చెందుతానన్నారు.

WITT 2025: యమునా ఘాట్‌లో సగర్వంగా ఛఠ్ పూజ జరుపుకుంటాంః రేఖ గుప్తా

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడే 2025లో ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యమునా నది శుభ్రపరిచే కార్యక్రమంలో నిమగ్నమయ్యామని అన్నారు. 2025లో పూర్వాంచల్ ప్రజలు యమునా ఘాట్‌లో ఛత్ పూజను సగర్వంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ, యమునా నదిలోకి పడుతున్న కాలువలను శుభ్రం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

WITT 2025: దేవుడు కోరుకుంటే, త్వరలోనే శ్రీకృష్ణుడు కూడా మధురలో ఉంటాడుః మోహన్ యాదవ్

TV9 మెగా ప్లాట్‌ఫామ్ 'వాట్ ఇండియా థింక్స్ టుడే'లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మధురలోని శ్రీకృష్ణుని ఆలయం, హిందూత్వం, వేద గణనలు, అభివృద్ధి, సైన్స్ వంటి వివిధ అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సరయు నది ఒడ్డున రామాలయం ఉంది, దేవుడు కోరుకుంటే, త్వరలోనే శ్రీకృష్ణుడు కూడా మధురలో ఉంటాడు. మేము హిందువులమని గర్విస్తున్నామని మోహన్ యాదవ్ స్పష్టం చేశారు.

WITT 2025: భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరం.. హద్దు దాటితే వేటు తప్పదుః అశ్విని వైష్ణవ్

ప్రపంచ సమ్మిట్ WITT 2025 అంటే దేశంలోని అతిపెద్ద వార్తా నెట్‌వర్క్ TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ రెండవ రోజు కార్యక్రమంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భావ ప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియా దుర్వినియోగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

WITT 2025: బుల్డోజర్‌ను సెలెక్టర్లు కాదు.. ఎలక్టర్లు నిర్ణయిస్తారుః పంజాబ్ సీఎం

బుల్డోజర్‌ను ఎంపిక చేసేవారు కాదు, ఓటర్లే ​​నిర్ణయిస్తారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ రెండవ రోజు కార్యక్రమానికి సీఎం భగవంత్ మాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుల్డోజర్ చర్య గురించి బహిరంగంగా మాట్లాడారు సీఎం భగవంత్ మాన్. బుల్డోజర్‌ను ఎందుకు.. ఎలా ఉపయోగిస్తారో ఆయన వివరించాడు. బుల్డోజర్ చర్యకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

WITT 2025: ఈడా ఉంటా.. ఆడా ఉంటా.. బీహార్ ముఖచిత్రం మార్చడమే లక్ష్యంః చిరాగ్ పాశ్వాన్

కేంద్ర రాజకీయాల్లోనే ఉండాలని తన తండ్రి చాలా స్పష్టంగా ఉన్నారని, దాంతోపాటు బీహార్ రాజకీయాల్లోనే ఉండాలని కోరుకుంటున్నానని, నేను కూడా అంతే స్పష్టంగా ఉన్నానని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు. శనివారం(మార్చి 29) జరిగిన టీవీ9 నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడే 2025 మూడవ ఎడిషన్‌లో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు.

WITT 2025: భారత్-అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం.. దేశాభివృద్ధికి దోహదంః పీయూష్ గోయల్

'వాట్ ఇండియా థింక్స్ టుడే' సమ్మిట్‌లో భాగమైన TV9 భారత్‌వర్ష్ సత్తా సమ్మేళన్‌లో కేంద్ర మంత్రి గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చలు, భౌగోళిక రాజకీయ గతిశీలతతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బలమైన వ్యక్తిగత బంధాన్ని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఈ టీ రోజూ తాగినా ఆరోగ్యమే.. దీంతో ఎన్ని ప్రయోజనాలో..
ఈ టీ రోజూ తాగినా ఆరోగ్యమే.. దీంతో ఎన్ని ప్రయోజనాలో..
సినిమాలతోకంటే సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న ముద్దుగుమ్మ
సినిమాలతోకంటే సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న ముద్దుగుమ్మ
చీ.. చీ.. విజయవాడలో యువ జంట అరాచకం.. బైక్‌పై అభ్యంతరకరంగా
చీ.. చీ.. విజయవాడలో యువ జంట అరాచకం.. బైక్‌పై అభ్యంతరకరంగా
పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ: సీఎం రేవంత్ రెడ్డి
పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ: సీఎం రేవంత్ రెడ్డి
పంజాబ్ ఘన విజయం! కెప్టెన్ గాయంపై అప్డేట్!
పంజాబ్ ఘన విజయం! కెప్టెన్ గాయంపై అప్డేట్!
కుర్ర హీరోయిన్స్‌కు గట్టిపోటీ ఇస్తున్న మన్మథుడు బ్యూటీ అన్షు అంబా
కుర్ర హీరోయిన్స్‌కు గట్టిపోటీ ఇస్తున్న మన్మథుడు బ్యూటీ అన్షు అంబా
దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులా.. రేపు భైరవుడిని ఇలా పూజించండి..
దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులా.. రేపు భైరవుడిని ఇలా పూజించండి..
పిల్లలను కాపాడేందుకు ఓ మహిళ తీవ్ర ప్రయత్నం...
పిల్లలను కాపాడేందుకు ఓ మహిళ తీవ్ర ప్రయత్నం...
నాని కాంపౌండ్‌‎ నుంచి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్.. వారెవరు.?
నాని కాంపౌండ్‌‎ నుంచి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్.. వారెవరు.?
వైభవ్‌ చదివే స్కూల్‌ ఇదే! ఫీజు ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
వైభవ్‌ చదివే స్కూల్‌ ఇదే! ఫీజు ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!