వాట్ ఇండియా థింక్స్ టుడే
దేశ రాజధాని ఢిల్లీలో ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. భారతదేశపు నంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ TV9 నిర్వహించనున్న ఈ సమ్మిట్లో దేశ రాజకీయాలు, పాలన, ఆర్థిక శాస్త్రం, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలతో సహా అనేక కీలక అంశాలు చర్చించబడతాయి. ఈ మూడు రోజుల సదస్సు ఫిబ్రవరి 25న ఆదివారంనాడు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు.
‘వాట్ ఇండియా థింక్స్ టుడే’లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, భూపేంద్ర యాదవ్, స్మృతి ఇరానీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ కూడా తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. దీంతో పాటు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ, ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ సహా కళారంగం, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు.
TV9 WITT Summit 2026: ఒవైసీ అర్ధం చేసుకోవాలి.. ఆ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?
ఇంధన రంగం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టీవీ9 నెట్వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యాలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 24, 2026
- 4:05 pm
WITT Summit 2026: వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్కీ బాత్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి టీవీ9 నెట్వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 24, 2026
- 3:30 pm
TV9 WITT Global Summit-2026: భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా పెత్తనం ఎందుకు?: ఒవైసీ
భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మేధావులు, వ్యాపార దిగ్గజాలు, విధాన రూపకర్తలు ఒకే వేదికపైకి వచ్చారు. టీవీ9 నెట్వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే 2026 సదస్సు దేశ రాజధాని న్యూఢిల్లీలో కొనసాగుతోంది. భారతదేశం - ప్రపంచం అనే ప్రధాన ఇతివృత్తంతో సాగే ఈ రెండ్రోజుల సదస్సు, దేశ అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక గొప్ప మేధోమథన వేదికగా నిలిచింది.
- Balaraju Goud
- Updated on: Mar 24, 2026
- 12:44 pm
PM Modi: యుద్ధంలో ఎవరి పక్షం.. ప్రధాని మోదీ ఏమన్నారో తెలుసా..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం టీవీ9 నెట్వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. గడిచిన ఐదు, ఆరు సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి.. కోవిడ్-19 మహమ్మారి వచ్చినప్పటి నుండి సవాళ్లు ఒకదాని తర్వాత ఒకటిగా పెరుగుతూనే ఉన్నాయంటూ మోదీ వివరించారు. 140 కోట్ల మంది పౌరుల ఐక్య కృషి వల్ల, భారతదేశం ప్రతి సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించిందని పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 24, 2026
- 11:07 am
TV9 WITT Summit: బలంగా ఉండండి, బలహీనపడితే ప్రపంచం మిమ్మల్ని మింగేస్తుందిః బాబా రామ్దేవ్
W.I.T.T.. వాట్ ఇండియా థింక్స్ టుడే. ఇవాళ ఇండియా ఏం ఆలోచిస్తోంది? ఇదీ థీమ్. సగటు భారతీయ పౌరుడి మన్కీ బాత్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది. వరుసగా మూడోసారి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోదీ.. సదస్సును ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న సమ్మిట్లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు పాల్గొంటున్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 24, 2026
- 10:24 am
TV9 WITT Summit-2026: దేశ అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే మేధోమథన వేదిక.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మేధావులు, వ్యాపార దిగ్గజాలు, విధాన రూపకర్తలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. టీవీ9 నెట్వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే 2026 సదస్సు సోమవారం (మార్చి 23) న్యూఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. భారతదేశం – ప్రపంచం అనే ప్రధాన ఇతివృత్తంతో సాగే ఈ రెండ్రోజుల సదస్సు, దేశ అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక గొప్ప మేధోమథన వేదికగా నిలవనుంది.
- Balaraju Goud
- Updated on: Mar 23, 2026
- 11:47 am
WITT 2025: టీవీ9 సమ్మిట్లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
WITT 2025: టీవీ9 నెట్వర్క్ 'వాట్ ఇండియా థింక్స్ టుడే' మూడవ ఎడిషన్ మార్చి 28న జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. హోటల్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. వందల మంది సమక్షంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీవీ9ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు..
- Subhash Goud
- Updated on: Mar 31, 2025
- 3:35 pm
WITT 2025: టోల్ టాక్స్పై వారంలో కీలక ప్రకటన.. టీవీ9తో నితిన్ గడ్కరీ
TV9 నెట్వర్క్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన WITT సమిట్లో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల గురించి వివరించారు. అలాగే టోల్ టాక్ గురించి ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే వారంలో టోల్ ఫీజుకు సంబంధించి ఒక పెద్ద ప్రకటన చేస్తానననారు.
- Balaraju Goud
- Updated on: Mar 30, 2025
- 3:31 pm
WITT 2025: భారతదేశంలో గతంలో ఉన్న ఆదర్శవాదం ఇప్పుడు లేదుః రణదీప్ సుర్జేవాలా
టీవీ9 నెట్వర్క్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ఇటీవలి ఎన్నికల ఓటమి, భారత కూటమి భవిష్యత్తు, కాంగ్రెస్లో సంస్థాగత మార్పులపై కీలక అంశాలను వెల్లడించారు. 2025లో ఇండియా థింక్స్ టుడే అనే అంశంపై ఆయన చర్చించారు. పార్టీలోని సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, యువ నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2025
- 9:24 pm
WITT 2025: అమేథీలో ఓటమికి అసలు కారణం ఇదే.. tv9 సమ్మిట్లో స్మృతి ఇరానీ
టీవీ9 మహామంచ్లో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అనేక అంశాలపై మాట్లాడారు. అమేథి ఎంపీగా ఉన్నప్పుడు చేసిన పని గురించి, ఆ తర్వాత అక్కడ ఎదుర్కొన్న ఓటమి గురించి ఆమె మాట్లాడారు. నాయకుడిని అయితే, సురక్షితమైన సీటు కోసం చూసేదానిని అని మాజీ కేంద్ర మంత్రి అన్నారు. నాయకుడిని అయితే, తదుపరి ఎన్నికల గురించి ఆందోళన చెందుతానన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2025
- 9:08 pm
WITT 2025: యమునా ఘాట్లో సగర్వంగా ఛఠ్ పూజ జరుపుకుంటాంః రేఖ గుప్తా
టీవీ9 నెట్వర్క్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడే 2025లో ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యమునా నది శుభ్రపరిచే కార్యక్రమంలో నిమగ్నమయ్యామని అన్నారు. 2025లో పూర్వాంచల్ ప్రజలు యమునా ఘాట్లో ఛత్ పూజను సగర్వంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ, యమునా నదిలోకి పడుతున్న కాలువలను శుభ్రం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2025
- 8:14 pm
WITT 2025: దేవుడు కోరుకుంటే, త్వరలోనే శ్రీకృష్ణుడు కూడా మధురలో ఉంటాడుః మోహన్ యాదవ్
TV9 మెగా ప్లాట్ఫామ్ 'వాట్ ఇండియా థింక్స్ టుడే'లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మధురలోని శ్రీకృష్ణుని ఆలయం, హిందూత్వం, వేద గణనలు, అభివృద్ధి, సైన్స్ వంటి వివిధ అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సరయు నది ఒడ్డున రామాలయం ఉంది, దేవుడు కోరుకుంటే, త్వరలోనే శ్రీకృష్ణుడు కూడా మధురలో ఉంటాడు. మేము హిందువులమని గర్విస్తున్నామని మోహన్ యాదవ్ స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2025
- 7:22 pm