Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT 2025: భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరం.. హద్దు దాటితే వేటు తప్పదుః అశ్విని వైష్ణవ్

ప్రపంచ సమ్మిట్ WITT 2025 అంటే దేశంలోని అతిపెద్ద వార్తా నెట్‌వర్క్ TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ రెండవ రోజు కార్యక్రమంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భావ ప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియా దుర్వినియోగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

WITT 2025: భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరం.. హద్దు దాటితే వేటు తప్పదుః అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 29, 2025 | 6:50 PM

రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరమని, కానీ దానికి పరిమితులు కూడా ఉండాలని కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రపంచ సమ్మిట్ WITT 2025 అంటే దేశంలోని అతిపెద్ద వార్తా నెట్‌వర్క్ TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ రెండవ రోజు కార్యక్రమంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భావ ప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియా దుర్వినియోగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని చూపించే వారు కూడా దానిని చదవాలని సూచించారు. హాస్యనటుడు కునాల్ కమ్రాకు సంబంధించిన కేసు సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరమని, కానీ దానికి పరిమితులు కూడా ఉండాలని వైష్ణవ్ అన్నారు.

సోషల్ మీడియాలో పెరుగుతున్న తప్పుడు సమాచారం, దేశ వ్యతిరేక కంటెంట్‌పై అశ్విని వైష్ణవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తోందని, పరిష్కారం కనుగొనడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పనిచేస్తోందని ఆయన అన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన పెంచడం ముఖ్యమని ఆయన అన్నారు.

భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొంతమంది తమ హద్దులు దాటుతున్నారని అశ్విని వైష్ణవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కులు ఇవ్వడం జరిగిందని, అయితే దానితో పాటు కొన్ని బాధ్యతలు కూడా జతచేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే దేశ సమగ్రతకు భంగం కలిగించేలా, సమాజంలో అశాంతిని సృష్టించేలా దుర్వినియోగం చేస్తే, దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైష్ణవ్ హెచ్చరించారు.

OTT ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. దీనికి సంబంధించి దేశంలో ఇప్పటికే ఒక చట్టం ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రజలతో మాట్లాడటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించడానికి నియమాలు రూపొందించడం జరిగింది. అవి పాటించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

బీహార్ ఎన్నికల గురించి చర్చిస్తూ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ దేశాన్ని 50-60 సంవత్సరాలు పాలించిందని, కానీ ఆ సమయంలో యువతకు పెద్దగా మార్పు రాలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోదీ పనిని ఇష్టపడుతున్నారని, అందుకే ఆయనకు మళ్లీ మళ్లీ ప్రజల మద్దతు లభిస్తోందని వైష్ణవ్ పేర్కొన్నారు. త్వరలో బీహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిదే ఘన విజయం అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..