AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT: టీవీ9 ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వాట్ ఇండియా టుడే థింక్స్’ కార్యక్రమం.. పాల్గొననున్న కేంద్ర మంత్రులు..

టీవీ 9 నెట్‌వర్క్ ప్రతిఏడాది నిర్వహించే వార్షిక కార్యక్రమం తిరిగి ప్రారంభంకానుంది. 'వాట్ ఇండియా టుడే థింక్స్'తో పేరుతో గొప్పగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మొదటి 2 రోజులలో 'గ్లోబల్ సమ్మిట్' నిర్వహించబడగా, ఫిబ్రవరి 27న 'సత్తా సమ్మేళన్' నిర్వహించబడుతుంది. 'సత్తా సమ్మేళనం'లో చాలా సెషన్‌లు రాజకీయంగా ఉంటాయి. అందులో పాల్గొనేవారు రాజకీయాలలో నిష్ణాతులుగా ఉంటారు.

WITT: టీవీ9 ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'వాట్ ఇండియా టుడే థింక్స్' కార్యక్రమం.. పాల్గొననున్న కేంద్ర మంత్రులు..
Dharmendra Pradhan Witt
Srikar T
| Edited By: |

Updated on: Feb 24, 2024 | 4:23 PM

Share

టీవీ 9 నెట్‌వర్క్ ప్రతిఏడాది నిర్వహించే వార్షిక కార్యక్రమం తిరిగి ప్రారంభంకానుంది. ‘వాట్ ఇండియా టుడే థింక్స్’తో పేరుతో గొప్పగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మొదటి 2 రోజులలో ‘గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించబడగా, ఫిబ్రవరి 27న ‘సత్తా సమ్మేళన్’ నిర్వహించబడుతుంది. ‘సత్తా సమ్మేళనం’లో చాలా సెషన్‌లు రాజకీయంగా ఉంటాయి. అందులో పాల్గొనేవారు రాజకీయాలలో నిష్ణాతులుగా ఉంటారు. సమావేశానికి వచ్చే అతిథులు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తమ విధివిధానాలను వివరించవచ్చు. ఈ సదస్సులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొంటారు. మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ఎన్నికల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తారు.

‘సత్తా సమ్మేళనం’లో ‘మోదీ హై తో గ్యారెంటీ హై’ సెషన్‌లో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను, అలాగే మోదీ ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాలలో సాధించిన విజయాలను ప్రస్తావించే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో దేశంలో ఎన్నికల నగారా మోగనుంది, ఎన్నికల తేదీల ప్రకటనతో రాజకీయ పార్టీలు తమ తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి. దీనిపై కూడా కేంద్ర మంత్రి తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు.

ఈసారి ఎన్డీయే 400 దాటుతుందా?

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి విజయం సాధించేందుకు పక్కా ప్రణాళికతో కసరత్తు చేస్తోంది. ప్రధాని మోదీ కూడా ఈసారి 400 దాటాలనే నినాదాన్ని లేవనెత్తారు. అలాగే తన బహిరంగ సభల్లో ‘మోదీ ఉంటే గ్యారెంటీ’ అంటూ నిరాటంకంగా చెబుతున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా తమ పార్టీ ‘మోదీ హై తో గ్యారంటీ హై’ అనే నినాదాన్ని ఎందుకు నిరంతరం లేవనెత్తుతుందో వివరించగలరు. ఈ నినాదంలో ఎంత నిజం ఉంది? అనేదానిపై వివరించే అవకాశం ఉంది. ‘ఎప్పుడైతే అన్ని చోట్లా ఆశలు ముగుస్తాయో, అప్పుడే ‘మోడీ గ్యారెంటీ’ మొదలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు. ఇటీవల, ప్రధాని మోదీ గుజరాత్‌లోని నవ్‌సారిలో ‘మోడీ గ్యారంటీ’ గురించి కూడా చెప్పారు. ప్రతి పేదవాడికి శాశ్వత ఇల్లు లభిస్తుందని, అలాగే ఖాళీ కడుపుతో నిద్రపోదని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇది ‘మోడీ హామీ’.

ఇవి కూడా చదవండి

‘సత్తా సమ్మేళన్’కు హాజరుకానున్నఅమిత్ షా..

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నిర్వహించనున్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ వేదికపై ‘సత్తా సమ్మేళనం’లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొంటారు. వీరితో పాటు బీజేపీ పాలిత 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. రెండు ఆమ్ ఆద్మీ పార్టీ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. రాబోయే ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశంతో ఈ సదస్సు ముగుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us