AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శబరిమల ఆలయంలో బంగారం మాయం.. గోల్డ్ స్కామ్‌పై హైకోర్టు సీరియస్.. సిట్ ఏర్పాటు….

శబరిమల ఆలయ బంగారు కుంభకోణంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్వారపాలక విగ్రహాల బంగారం బరువు తగ్గడం, ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు** అధికారుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. దర్యాప్తు కోసం ఏడీజీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

శబరిమల ఆలయంలో బంగారం మాయం.. గోల్డ్ స్కామ్‌పై హైకోర్టు సీరియస్.. సిట్ ఏర్పాటు....
Sabarimala Gold Scam
Krishna S
|

Updated on: Oct 06, 2025 | 10:34 PM

Share

శబరిమల ఆలయ ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన బంగారు పూత తాపడాల బరువు తగ్గడం, ఆభరణాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కుంభకోణంలో అవినీతి పాల్పడింది కేవలం ఉన్నికృష్ణన్ పొట్టి మాత్రమే కాదని, దేవాలయ ఆస్తులను నిర్వహించే దేవస్వోం బోర్డు అధికారుల ప్రమేయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ కేసు, శిక్షార్హమైన పలు నేరాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది. ఈ కుంభకోణంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

స్వర్ణ కుంభకోణం’పై ఏర్పాటైన సిట్‌కు కేరళ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ వెంకటేష్ నేతృత్వం వహిస్తారు. సిట్ ఈ కుంభకోణంపై అత్యంత నిజాయితీతో, గోప్యంగా దర్యాప్తు నిర్వహించాలని, అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ స్కామ్‌కు బలం చేకూర్చే కీలక అంశాన్ని విచారణ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. 2019 డిసెంబర్ 9న ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు అధ్యక్షుడికి పంపిన ఒక ఈ-మెయిల్‌ను కోర్టు పరిశీలించింది.

శబరిమల గర్భగుడి, ద్వారపాలకుల విగ్రహాల తాపడాలకు బంగారపు పూత పనులు పూర్తయిన తర్వాత తన దగ్గర అదనంగా పసిడి పలకలు మిగిలాయని పొట్టి ఆ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. ఆ అదనపు బంగారాన్ని ఒక పేద అమ్మాయి పెళ్లి కోసం వినియోగించడంపై దానిలో అభిప్రాయం కోరారు. దీన్ని చూస్తుంటే పొట్టి దగ్గర మిగులు బంగారం ఉన్నట్లు స్పష్టమవుతోందని, అందుకే ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు, దేవాలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు సిట్ దర్యాప్తు కీలకంగా మారనుంది.

అసెంబ్లీలో తీవ్ర నిరసన

అసెంబ్లీలో ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ప్రతిపక్ష నాయకుడు V D సతీశన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు రెండూ దొంగతనం గురించి తెలిసినప్పటికీ దానిని అణచివేయాలని కుట్రలు చేశాయని ఆయన ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం