AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bribery Case: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి లంచం కేసులో కీలక మలుపు..! రంగంలోకి ఈడీ.. ఏం జరగనుంది..?

అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుండగా, ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక,జేడీఎస్ కూడా మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.

Bribery Case: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి లంచం కేసులో కీలక మలుపు..! రంగంలోకి ఈడీ.. ఏం జరగనుంది..?
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2023 | 4:42 PM

Share

బెంగళూరు దావణగెరె జిల్లా చన్నగిరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడి లంచం కేసులో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేసుకు సంబంధించి సమాచారం కోరింది ED. లంచం కేసులో అక్రమ డబ్బు దొరికిన నేపథ్యంలో సమాచారం కోరుతూ ED ఈ-మెయిల్ పంపింది. మీరు నమోదు చేసిన కేసు వివరాలను వెల్లడించాలంటూ ED కర్ణాటక లోకాయుక్తకు ఈ-మెయిల్ పంపింది. లంచం సమాచారం పూర్తి స్థాయిలో సేకరించిన అనంతరం లోకాయుక్త అధికారులు ఈడీకి సమాచారం అందించనున్నారు . కేసు ప్రాథమిక దర్యాప్తు నివేదికతో పాటు ఈడీకి సమాచారం అందించనున్నట్లు తెలిసింది. లోకాయుక్త నివేదికతో ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పతో పాటుగా ఆయన కుమారుడు ప్రశాంత్ కూడా ఈడీ చిక్కుల్లో పడ్డారు.

చన్నగిరి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు అందుకున్నారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా లోకాయుక్త ఉచ్చులో పడ్డాడు. ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు గుట్టల కోద్దీ నోట్ల కట్టలు గుర్తించారు. దాదాపు రూ. 8 కోట్ల వరకు నగదును లోకాయుక్త అధికారులు సీజ్‌ చేసినట్టుగా సమాచారం.

టెండర్ ఆశించిన ప్రశాంత్ మోడల్ నుండి రూ.80 లక్షలు. లంచం డిమాండ్ చేశాడు. ఇందులో 40 లక్షలు రూ. లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇంటిని తనిఖీ చేసిన లోకాయుక్త అధికారులకు ఎక్కడ చూసినా డబ్బు కట్టలే కనిపించాయి. ఈ కేసుకు సంబంధించి ప్రశాంత్ మాదాల్, అతని బంధువు సిద్దేష్, అకౌంటెంట్ సురేంద్ర, డబ్బులు చెల్లించేందుకు వచ్చిన నికోలస్, గంగాధర్‌లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఐదుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్ ఫ్యాక్టరీ లిమిటెడ్ (కెఎస్‌డిఎల్) ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తన కుమారుడి లంచం కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుండగా, ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. ఇక,జేడీఎస్ కూడా మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్