AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMD Weather Report: రానున్న మూడు రోజుల్లో దేశంలో భారీ వర్షాలు.. ఈ 11 రాష్ట్రాల్లో ఐఎండీ హెచ్చరిక

దేశంలోని పలు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . ఇప్పుడు వాతావరణ శాఖ 11 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు..

IMD Weather Report: రానున్న మూడు రోజుల్లో దేశంలో భారీ వర్షాలు.. ఈ 11 రాష్ట్రాల్లో ఐఎండీ హెచ్చరిక
IMD Weather Report
Subhash Goud
|

Updated on: Oct 09, 2022 | 1:11 PM

Share

దేశంలోని పలు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . ఇప్పుడు వాతావరణ శాఖ 11 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఐఎండీ తెలిపింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. .గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ( ఐఎండీ) అంచనా వేసింది. సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఆదివారంపిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఢిల్లీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. వర్షాల కారణంగా దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రత 20.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

రాజస్థాన్‌లో వర్షం:

గత 24 గంటల్లో రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో కొత్త వాతావరణ వ్యవస్థ చురుకుగా ఉండటమే దీనికి కారణం. జైపూర్ వాతావరణ కేంద్రం ఇన్‌ఛార్జ్ రాధేశ్యామ్ శర్మ ప్రకారం.. గత 24 గంటల్లో, తూర్పు రాజస్థాన్‌లోని దాదాపు అన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కరౌలి, ధోల్‌పూర్, బన్స్వారా, ప్రతాప్‌గఢ్, ఝలావర్, బరన్, సవాయ్ మాధోపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, కోటా జిల్లాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ కాలంలో కరౌలిలో అత్యధికంగా 118 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని శర్మ తెలిపారు. తూర్పు రాజస్థాన్‌లో రానున్న రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

అకాల వర్షాల వల్ల పెరగనున్న రోగాలు:

అకాల వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా ఢిల్లీ ఆసుపత్రులలో ఎక్కువగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఉన్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మూల్‌చంద్‌ ఆస్పత్రి శ్వాసకోశ నిపుణుడు డాక్టర్‌ భగవాన్‌ మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, జ్వరం, టైఫాయిడ్‌, స్వైన్‌ ఫ్లూ, అలర్జీలు, న్యుమోనియా తదితర వ్యాధులతో సహా ఈ రోజుల్లో ఔట్‌ పేషెంట్‌ విభాగానికి (ఓపీడీ) 20 మందికి పైగా రోగులు వస్తున్నారు. డెంగ్యూ రోగులు కూడా పెరిగిపోతున్నారు. ఇంతకుముందు ఇలాంటి రోగుల సంఖ్య రోజుకు 10 కంటే తక్కువగా ఉండేదని, ఇప్పుడు అది విపరీతంగా పెరుగుతోందని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి