Indian parliament: కొత్త పార్లమెంట్ ఆకారంలో ఆభరణాలు.. ఔరా అనిపిస్తున్న మోదీ 3డీ లాకెట్..
గుజరాత్లోని సూరత్కు చెందిన సోనియో అనే ఆభరణాల తయారీ సంస్థ.. కొత్త పార్లమెంట్ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను తయారు చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ఫొటోతో డైమండ్ లాకెట్, వెండితో పార్లమెంట్నమూనాతో పాటు మరికొన్ని ఆభరణాలు...
గుజరాత్లోని సూరత్కు చెందిన సోనియో అనే ఆభరణాల తయారీ సంస్థ.. కొత్త పార్లమెంట్ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను తయారు చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ఫొటోతో డైమండ్ లాకెట్, వెండితో పార్లమెంట్నమూనాతో పాటు మరికొన్ని ఆభరణాలు ప్రజలు ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా చెవిపోగులు, ఉంగరాలు. పెండెంట్లను రూపొందించారు. భారత్తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ ఆభరణాలకు డిమాండ్ కనిపిస్తోంది. ప్రధాని మోదీ ఫొటోతో ఉన్న 3డీ ప్రింటింగ్ ఆభరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వ్రజాలతో నిండి ఉన్న ఆ లాకెట్ 2.5 ఇంచెస్ ఉంది.
సూరత్ జ్యువెలరీ తయారీదారుల సంఘం అధ్యక్షురాలు జయంతి సన్వాలియా ఈ ఆభరణాల గురించి మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం త్రిభుజాకార రూపంలో కొత్త పార్లమెంట్ను నిర్మించింది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అందుకే ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే కొత్త పార్లమెంట్ భవన నమూనాను బంగారం, వెండితో భారత ప్రజల కోసమే తయారు చేశాం. కొత్త పార్లమెంట్ ఆకృతిలో తయారు చేసిన ఉంగరాలు, చెవి రింగుల బరువు 2 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉంటాయ’ని చెప్పుకొచ్చారు.
మరో వ్యాపారవేత్త రోహన్ షా మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ ఇటీవల కొత్త పార్లమెంట్భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకే పార్లమెంట్ నమూనాను రూపొందించాలనే ఆలోచన మాకు వచ్చింది. ఈ వెండి పార్లమెంట్నమూనా.. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ దీన్ని ప్రదర్శించబోతున్నాం. మోదీ డైమండ్లాకెట్కు చాలా డిమాండ్ ఉంద’ని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..