AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై విద్యార్ధులు ప్రతి ఆదివారం చదువుకోకూడదు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా శీతారామన్‌

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా శీతారామన్‌ యువశక్తి సంవాద్‌ కార్రక్రమంలో ఆదివారం (జనవరి 8) దేవ యువతనుద్ధేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. ఆదివారాల్లో కూడా పుస్తకాలు పట్టి..

ఇకపై విద్యార్ధులు ప్రతి ఆదివారం చదువుకోకూడదు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా శీతారామన్‌
Nirmala Sitharaman
Srilakshmi C
|

Updated on: Jan 09, 2023 | 12:03 PM

Share

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా శీతారామన్‌ యువశక్తి సంవాద్‌ కార్రక్రమంలో ఆదివారం (జనవరి 8) దేవ యువతనుద్ధేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. ఆదివారాల్లో కూడా పుస్తకాలు పట్టి చదవుకోవద్దని విద్యార్ధులకు సూచించారు. చదువుల్లో కూరుకుపోవడం వల్ల వారి కెరీర్‌పై మరింత శ్రద్ధచూపడంలేదన్నారు. మరిన్ని ఉద్యోగాలు రానున్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని మార్గనిర్దేశం చేశారు.

బిజినెస్ ఐడియాలు ఉన్న యువత అధికారులు, మంత్రులను కలవడానికి ఆహ్వానంపలికారు. తమ ప్రశ్నలకు వారి నుంచి నేరుగా సమాధానాలు పొందవచ్చన్నారు. డిజిటల్ యూనివర్శిటీని ‘ప్రగతిశీల ఆలోచన’గా అభివర్ణించారు. విద్యారంగంలో విద్యార్థులు అమితాసక్తిని కనబరుస్తున్నారని అన్నారు. సెంట్రల్ డిజిటల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ దీనిని హబ్, స్పోక్ మోడల్‌తో నిర్వహిస్తుందని నిర్మలా శీతారామన్‌ అన్నారు. అలాగే తన స్పీచ్‌లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి కూడా ప్రస్తావించారు. కేంద్రం మాత్రమే కాకుండా రాష్ట్రాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. వ్యాపార సౌలభ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం వివిధ పరిపాలనా స్థాయిల్లో సహకరిస్తోందని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.