The Kerala Story: ఒంటరిగా బయటకు వెళ్లకండి.. ‘ది కేరళ స్టోరి’ చిత్ర బృందానికి బెదిరింపులు
ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరి చిత్రం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ సినిమాను కొంతమంది వ్యతిరేకిస్తుంటే మరికొందరు మద్ధతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, చిత్ర బృందంలోని ఇతరులకి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది.

ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరి చిత్రం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ సినిమాను కొంతమంది వ్యతిరేకిస్తుంటే మరికొందరు మద్ధతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, చిత్ర బృందంలోని ఇతరులకి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లకండి..ఈ చిత్రాన్ని ప్రదర్శించి మంచి పనులు చేయలేరంటూ ఆగంతకుడు బెదిరించాడు. దీంతో సుదీప్తో సేన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాతపూర్వకంగా ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అయితే చిత్రబృందానికి భద్రత కల్పించారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, నిషేధిస్తున్నాయి. కానీ ఉత్తర్ ప్రదేశ్ మాత్రం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇంతకుముందు మధ్యప్రదేశ్ కూడా ఈ మినహాయింపునిచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఈ సినిమాను నిషేధం విధించిన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో విద్వేషం, హింసాత్మక ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం