ముచ్చటగా మూడో సారి ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న కియారా.? 

Rajeev 

22  February 2026

కియారా అద్వానీ.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది. టాలీవుడ్లో సక్సెస్ కాలేకపోతుంది. 

సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను అనే సినిమాతో తెలుగులోకి పరిచయం అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

మహేష్ బాబు, కియార్ జోడీ అభిమానులను ఆకట్టుకుంది. ఆతర్వాత వినయ విధేయ రామ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. 

ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. చాలా కాలం తర్వాత తెలుగులో మరోసారి చరణ్ తో సినిమా చేసింది. 

చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దాంతో తెలుగు వైపు చూడటంలేదు ఈ చిన్నది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకు మరో తెలుగు మూవీలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ముచ్చటగా మూడోసారి చరణ్ కు జోడిగా కియారా నటిస్తుందని టాక్. 

చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో కియారా నటించే అవకాశాలు ఉన్నానంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.