AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదు

మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదు

Samatha J
|

Updated on: Feb 22, 2026 | 4:40 PM

Share

మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ రావు తమ 44 ఏళ్ల సాయుధ పోరాట అనుభవాలను వెల్లడించారు. ఉద్యమం చేసిన తీవ్ర తప్పుల కారణంగా దాని ఉనికి కోల్పోయిందని అంగీకరించారు. ప్రజల మధ్యకు వచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి రాజ్యాంగబద్ధంగా కృషి చేస్తానని తెలిపారు. మిగిలిన కామ్రేడ్‌లు కూడా బయటికి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మాజీ మావోయిస్టు కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ రావు, మావోయిస్టు ఉద్యమానికి భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. 44 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చిన ఆయన, ఉద్యమం చేసిన తప్పులను నిర్మొహమాటంగా అంగీకరించారు. మార్క్సిజంను సరిగా అర్థం చేసుకోకపోవడం, పార్టీ నిర్మాణ సూత్రాలను విస్మరించడం, 21వ శతాబ్దానికి అనుగుణంగా మారకపోవడం వంటి లోపాల వల్లే ఉద్యమం బలహీనపడిందని పేర్కొన్నారు. తాను ఇప్పుడు ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులైన కామ్రేడ్ దేవజీ, మల్లా రాజిరెడ్డి వంటి వారికి కూడా బయటికి వచ్చి ప్రజాస్వామ్య మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?

ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!

టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్

క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే

Follow Us