AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో నెల రోజుల పోరాటం.. కన్నుమూసిన యువ వైద్యుడు

కరోనాతో మహమ్మారితో నెల రోజులుగా పోరాటం చేస్తోన్న యువ వైద్యుడు తనువు చాలించారు. ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వైద్యుడు తాజాగా తుది శ్వాస విడిచారు.

కరోనాతో నెల రోజుల పోరాటం.. కన్నుమూసిన యువ వైద్యుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 5:25 PM

Share

కరోనాతో మహమ్మారితో నెల రోజులుగా పోరాటం చేస్తోన్న యువ వైద్యుడు తనువు చాలించారు. ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వైద్యుడు తాజాగా తుది శ్వాస విడిచారు.

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన జోగిందర్ చౌదరి(27) అనే వైద్యుడు ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రిలో అక్టోబర్ 19 నుంచి పని చేస్తున్నారు. తన తోటి ఉద్యోగుల్లో ఇద్దరికి కరోనా సోకడంతో.. జితేంద్ర గత నెల 19న కరోనా పరీక్ష చేయించుకున్నారు.

నాలుగు రోజుల తరువాత పాజిటివ్‌గా నిర్ధారణ రావడంతో తను పనిచేస్తున్న ఆసుపత్రిలోనే అడ్మిట్ అయ్యారు. అక్కడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో లోక్ నాయక్ జై ప్రకాష్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స తీసుకునే క్రమంలో అతడి ఊపిరితిత్తుల్లో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఈ నెల 7న జితేందర్‌ని ఎస్‌ఆర్‌జీహెచ్‌కి తరలించారు.

ఈ క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించగా.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో జితేందర్ కన్నుమూశారు. కాగా అతడికి చికిత్స అందించే క్రమంలో 3లక్షలకు పైగా బిల్లు అయ్యింది. అయితే అతడి కుటంబానికి అంత చెల్లించే స్తోమత లేకపోవడంతో.. జితేందర్‌ స్నేహితులు ఆన్‌లైన్‌లో ఫండ్స్ రైజింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే క్రమంలో జితేందర్ కుటుంబం పరిస్థితి తెలిసిన ఆసుపత్రి యాజమాన్యం.. బిల్లును మాఫీ చేసింది. మరోవైపు జితేందర్ మరణ వార్త ఇంకా తల్లికి తెలియనివ్వలేదు. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై దిగులు చెంది అనారోగ్యం బారిన పడ్డ ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక జితేందర్ మరణంతో గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

Read This Story Also: Breaking: కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య, ఆరాధ్య