AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ రెండు సంస్థలూ ఇక ‘మార్కెట్‌లో’..

భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను మార్చి 2020లోపు అమ్మనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇప్పటివరకు ఈ రెండు కంపెనీలలో కేంద్రం పెట్టుబడులను పెట్టగా.. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ .1 లక్ష కోట్ల రాబడులను సమీకరించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. చాలామంది ఇన్వెస్టర్లు ఈ రెండు కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇక ఎయిర్ ఇండియా […]

కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ రెండు సంస్థలూ ఇక 'మార్కెట్‌లో'..
Ravi Kiran
|

Updated on: Nov 17, 2019 | 5:38 PM

Share

భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను మార్చి 2020లోపు అమ్మనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇప్పటివరకు ఈ రెండు కంపెనీలలో కేంద్రం పెట్టుబడులను పెట్టగా.. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ .1 లక్ష కోట్ల రాబడులను సమీకరించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. చాలామంది ఇన్వెస్టర్లు ఈ రెండు కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇక ఎయిర్ ఇండియా సంస్థ దాదాపు రూ.58,000 కోట్ల అప్పుల్లో ఉండగా ఆర్ధికమంత్రి నుంచి ఇటువంటి ప్రకటన రావడం గమనార్హం. 

ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లోహాని.. పెట్టుబడులు ఉపసంహరణ సంస్థ స్థిరత్వానికి దోహదపడుతుందంటూ గతంలోనే ఉద్యోగులందరికీ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అదే విధంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ చెందిన 53.29శాతం వాటాను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశాన్ని ఆర్ధిక సంక్షోభం పట్టి పీడిస్తుండగా.. వివిధ రంగాల్లో మాంద్యం ఏర్పడిందని… దాన్ని అధిగమనించడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందంటూ నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఆర్ధిక సంవత్సరం బ్యాలన్స్ షీట్ మెరుగుపడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం విధించిన జీఎస్టీ వసూళ్ల వల్ల కొన్ని రంగాల్లో అమ్మకాలు అభివృద్ధి చెందాయన్నారు. అటు సుప్రీం కోర్టు.. ఎస్సార్ స్టీల్‌‌కు సంబంధించి ఇచ్చిన తీర్పు కూడా ఐబీసీ చట్ట రాజ్యాంగబద్దతను, చట్టబద్దతను బలోపేతం చేసిందన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాతో పాటు ఆయిల్ రిఫైనర్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బిపిసిఎల్)ను 2020 మార్చి నాటికి అమ్మేందుకు సిద్ధపడిందని తెలిపారు. మరి ఆర్ధిక మందగమనాన్ని నిర్మూలించడం కోసం కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి..?

Follow Us
కూరగాయలు లేనప్పుడు లేనప్పుడు సింపుల్ రైస్ రెసిపీ తయారు చేసుకోండి
కూరగాయలు లేనప్పుడు లేనప్పుడు సింపుల్ రైస్ రెసిపీ తయారు చేసుకోండి
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ రహానే.. అనుభవం వైపే మొగ్గు చూపిన షారుఖ్
కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ రహానే.. అనుభవం వైపే మొగ్గు చూపిన షారుఖ్
ఏవియేషన్, క్లైమాట్ సైన్స్, మారిటైమ్ కోర్సులు ఇక మన వర్సిటీల్లోనే!
ఏవియేషన్, క్లైమాట్ సైన్స్, మారిటైమ్ కోర్సులు ఇక మన వర్సిటీల్లోనే!
చెప్పులు వేసుకుని వంట చేస్తున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..
చెప్పులు వేసుకుని వంట చేస్తున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..
పెట్టుబడిదారులకు గోల్డెన్‌ ఛాన్స్‌!
పెట్టుబడిదారులకు గోల్డెన్‌ ఛాన్స్‌!
జ్యూస్ కంటే పండ్లు తినడం ఎందుకు మంచిది? ఆరోగ్య లాభాలు vs జ్యూస్..
జ్యూస్ కంటే పండ్లు తినడం ఎందుకు మంచిది? ఆరోగ్య లాభాలు vs జ్యూస్..
అబ్బ సాయిరాం.. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణశాఖ
అబ్బ సాయిరాం.. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణశాఖ
గుడ్ న్యూస్.. గ్యాస్ ధరలను భారీగా తగ్గించిన ఆదానీ గ్రూప్..
గుడ్ న్యూస్.. గ్యాస్ ధరలను భారీగా తగ్గించిన ఆదానీ గ్రూప్..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..