AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ 5 ఎకరాలు మాకెందుకు ? రివ్యూ పిటిషన్ వేస్తాం.. ముస్లిం పర్సనల్ లా బోర్డు

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని లక్నోలో సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్న రూలింగ్ ని సవాలు చేస్తామని, ఆ భూమిని తాము నిరాకరిస్తామని బోర్డు ప్రతినిధులు తెలిపారు. మసీదుకు సంబంధించిన స్థలం అల్లాకు చెందినదని, షరియత్ చట్టం కింద దాన్ని ఎవరికీ ఇవ్వజాలరని ఈ సమావేశం అనంతరం ఈ బోర్డు కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ అన్నారు. మసీదుకు మరే […]

ఆ 5 ఎకరాలు మాకెందుకు ? రివ్యూ పిటిషన్ వేస్తాం..  ముస్లిం పర్సనల్ లా బోర్డు
Anil kumar poka
| Edited By: |

Updated on: Nov 17, 2019 | 5:27 PM

Share

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని లక్నోలో సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్న రూలింగ్ ని సవాలు చేస్తామని, ఆ భూమిని తాము నిరాకరిస్తామని బోర్డు ప్రతినిధులు తెలిపారు. మసీదుకు సంబంధించిన స్థలం అల్లాకు చెందినదని, షరియత్ చట్టం కింద దాన్ని ఎవరికీ ఇవ్వజాలరని ఈ సమావేశం అనంతరం ఈ బోర్డు కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ అన్నారు. మసీదుకు మరే ప్రత్యామ్నాయం లేదని ఆయన చెప్పారు. అటు-తమ రివ్యూ పిటిషన్ ను కోర్టు వంద శాతం కొట్టివేస్తుందని తమకు తెలుసునని, కానీ రివ్యూ పిటిషన్ ను తాము కూడా వేస్తామని జమాయిత్-ఉలేమా-ఎ-హింద్ అధినేత మౌలానా అర్షద్ మదానీ పేర్కొన్నారు. ‘ ఇది మా హక్కు ‘ అన్నారు. అయోధ్యపై కోర్టు తీర్పును తాము కూడా సవాలు చేస్తామన్నారు.

ముస్లిం పర్సనల్ లాబోర్డు సమావేశానికి హాజరైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా.. ఐదెకరాల స్థలాన్ని తాము కోరుకోవడంలేదని చెప్పారు.’ ఈ దానం మాకు వద్దు.. బాబరీ మసీదుకు సంబంధించి మా న్యాయబధ్ధమైన హక్కు కోసం పోరాడుతాం ‘ అని ఆయన అన్నారు. కాగా-సుప్రీంకోర్టు తీర్పుపై ఈ బోర్డు.. వివిధ ముస్లిం పార్టీలతో విస్తృత చర్చలు జరిపింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలా, వద్దా అన్నదానిపై ఈ సమావేశాల్లో చర్చించారు. అత్యున్నత న్యాయస్థానం ఇఛ్చిన తీర్పు ‘ అర్థం కానిదిగా ‘ ఉందని, అందువల్ల రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించామని జిలానీ మళ్ళీ స్పష్టం చేశారు. నిజానికి మొదట ఈ నెల 3 న జరిగిన సమావేశంలో వివిధ ముస్లిం సంస్థల ఆఫీసు బేరర్లు, మత గురువులు.. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. దాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించడం విశేషం.

Follow Us