AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senior Citizen Pension: అధికారుల మాయాజాలం! కాగితాల్లో చంపేశారు.. బతికున్నట్లు ధృవీకరణ పత్రం తెమ్మన్నారు

ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్‌ కోసం ఓ పండు ముదుసలి ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో 70 ఏళ్ల వయసులో తాను బతికే ఉన్నానని..

Senior Citizen Pension: అధికారుల మాయాజాలం! కాగితాల్లో చంపేశారు.. బతికున్నట్లు ధృవీకరణ పత్రం తెమ్మన్నారు
Senior Citizen Pension
Srilakshmi C
|

Updated on: May 28, 2023 | 3:51 PM

Share

ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్‌ కోసం ఓ పండు ముదుసలి ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో 70 ఏళ్ల వయసులో తాను బతికే ఉన్నానని ఎలా నిరూపించుకోవాలో తెలీక అవస్థలు పడుతున్నాడు. వివరాల్లోకెళ్తే..

ఝార్ఖండ్​ బొకారో జిల్లాలోని బాగ్దా గ్రామానికి చెందిన ఖేదాన్ ఘాన్సీ (70) గత కొన్నేళ్లుగా ప్రభుత్వ అందించే వృద్ధాప్య పింఛను అందుకుంటున్నాడు. గతేడాది సెప్టెంబర్​నుంచి అధికారులు పెన్షన్‌ నిలిపేశారు. దీంతో పింఛను ఎందుకు రావడం లేదో తెలియక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఖేదాన్ ఘాన్సీ ఆరా తీశాడు. అతడు మరణించినట్లుగా రికార్డుల్లో అధికారులు ఎక్కించినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నాడు. వేడుకున్నాడు ఖేదాన్ ఘాన్సీ. ‘సారూ.. నేను ఇంకా బతికే ఉన్న కదా.. చనిపోయానని రికార్డుల్లో అలా ఎలా రాసుకున్నారంటూ అమాయకంగా ప్రశ్నించాడు. వృద్ధుడి ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పకపోగా.. బతికే ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మంటూ వృద్ధుడికి చెప్పారు. చనిపోతే డెత్​సర్టిఫికేట్ ఉంటుంది కానీ.. బతికున్నట్లు సర్టిఫికేట్ ఎక్కడ నుంచి తీసుకురావాలో అతనికి పాలుపోలేదు.

ఈ వంకతో గత 9 నెలలుగా పింఛను ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వాధికారులు కావాలనే తన పించన్‌ నిలిపివేశారని ఆరోపిస్తూ ఖేదాన్ ఘాన్సీ జిల్లా ఉన్నతాధికారి విజయ్‌కుమార్‌కు లేఖ రాశాడు. ‘బతికే ఉన్నా.. చనిపోయినట్లుగా రికార్డుల్లో ఎలా నమోదు చేస్తారు..? తక్షణమే అతడికి పింఛను తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోండి. 2022 సెప్టెంబర్​ నుంచి ఇప్పటివరకు ఆగిపోయిన మొత్తం పెన్షన్​ సొమ్మును చెల్లించండి’ అంటూ అధికారులను ఆదేశించాడు. బీడీఓ స్థాయి అధికారి స్వయంగా ఆదేశించినా అధికారులు ఇంతవరకూ ఆ వృద్ధుడికి పింఛన్‌ను పునరుద్ధరించకపోవడం కొసమెరుపు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రతి ఒక్కరూ దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
అదృష్టం ఊరించింది..దురదృష్టం వెక్కిరించింది..వైభవ్ బ్యాడ్ లక్
అదృష్టం ఊరించింది..దురదృష్టం వెక్కిరించింది..వైభవ్ బ్యాడ్ లక్