Senior Citizen Pension: అధికారుల మాయాజాలం! కాగితాల్లో చంపేశారు.. బతికున్నట్లు ధృవీకరణ పత్రం తెమ్మన్నారు

ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్‌ కోసం ఓ పండు ముదుసలి ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో 70 ఏళ్ల వయసులో తాను బతికే ఉన్నానని..

Senior Citizen Pension: అధికారుల మాయాజాలం! కాగితాల్లో చంపేశారు.. బతికున్నట్లు ధృవీకరణ పత్రం తెమ్మన్నారు
Senior Citizen Pension
Follow us

|

Updated on: May 28, 2023 | 3:51 PM

ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్‌ కోసం ఓ పండు ముదుసలి ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో 70 ఏళ్ల వయసులో తాను బతికే ఉన్నానని ఎలా నిరూపించుకోవాలో తెలీక అవస్థలు పడుతున్నాడు. వివరాల్లోకెళ్తే..

ఝార్ఖండ్​ బొకారో జిల్లాలోని బాగ్దా గ్రామానికి చెందిన ఖేదాన్ ఘాన్సీ (70) గత కొన్నేళ్లుగా ప్రభుత్వ అందించే వృద్ధాప్య పింఛను అందుకుంటున్నాడు. గతేడాది సెప్టెంబర్​నుంచి అధికారులు పెన్షన్‌ నిలిపేశారు. దీంతో పింఛను ఎందుకు రావడం లేదో తెలియక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఖేదాన్ ఘాన్సీ ఆరా తీశాడు. అతడు మరణించినట్లుగా రికార్డుల్లో అధికారులు ఎక్కించినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నాడు. వేడుకున్నాడు ఖేదాన్ ఘాన్సీ. ‘సారూ.. నేను ఇంకా బతికే ఉన్న కదా.. చనిపోయానని రికార్డుల్లో అలా ఎలా రాసుకున్నారంటూ అమాయకంగా ప్రశ్నించాడు. వృద్ధుడి ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పకపోగా.. బతికే ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మంటూ వృద్ధుడికి చెప్పారు. చనిపోతే డెత్​సర్టిఫికేట్ ఉంటుంది కానీ.. బతికున్నట్లు సర్టిఫికేట్ ఎక్కడ నుంచి తీసుకురావాలో అతనికి పాలుపోలేదు.

ఈ వంకతో గత 9 నెలలుగా పింఛను ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వాధికారులు కావాలనే తన పించన్‌ నిలిపివేశారని ఆరోపిస్తూ ఖేదాన్ ఘాన్సీ జిల్లా ఉన్నతాధికారి విజయ్‌కుమార్‌కు లేఖ రాశాడు. ‘బతికే ఉన్నా.. చనిపోయినట్లుగా రికార్డుల్లో ఎలా నమోదు చేస్తారు..? తక్షణమే అతడికి పింఛను తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోండి. 2022 సెప్టెంబర్​ నుంచి ఇప్పటివరకు ఆగిపోయిన మొత్తం పెన్షన్​ సొమ్మును చెల్లించండి’ అంటూ అధికారులను ఆదేశించాడు. బీడీఓ స్థాయి అధికారి స్వయంగా ఆదేశించినా అధికారులు ఇంతవరకూ ఆ వృద్ధుడికి పింఛన్‌ను పునరుద్ధరించకపోవడం కొసమెరుపు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రతి ఒక్కరూ దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్