AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో 6G.. రోడ్‌మ్యాప్‌ రెడీ చేసిన ప్రభుత్వం! అప్పటి నుంచే సేవలు..

భారత్ 6జీ టెక్నాలజీ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. టెలికాం ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రూ.271 కోట్ల నిధులతో 104 ప్రాజెక్టులకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 6జీ సర్వీసుల అభివృద్ధి, స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ 'భారత్ 6జీ విజన్' డాక్యుమెంట్ విడుదల చేసింది.

భారత్‌లో 6G.. రోడ్‌మ్యాప్‌ రెడీ చేసిన ప్రభుత్వం! అప్పటి నుంచే సేవలు..
India 6g Technology
SN Pasha
|

Updated on: Mar 14, 2026 | 7:30 AM

Share

భారత్‌ తన 6జీ టెక్నాలజీ వైపు తన పోటీని వేగవంతం చేస్తోంది. టెలికాం రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 104 ప్రాజెక్ట్స్ కు మద్దతు ఇస్తోంది. ఇందుకోసం టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా సుమారు రూ.271 కోట్లు అందిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ నిధులు రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్, స్టార్టప్స్, టెలికాం రంగంలోని ఇండస్ట్రీ ప్లేయర్స్ కు తదుపరి తరం టెక్నాలజీల అభివృద్ధికి సహాయపడతాయి. ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఉంది, భవిష్యత్తు టెలికాం టెక్నాలజీని భారతదేశమే ముందుండి నడిపించాలని, కేవలం ఇతర దేశాలను అనుసరించడమే కాకుండా నాయకత్వం వహించాలని భావిస్తోంది.

భారత్ 6జీ విజన్

ప్రభుత్వం భారత్ 6జీ విజన్ డాక్యుమెంట్ ను కూడా విడుదల చేసింది. ఇందులో 6జీ సర్వీసెస్ అభివృద్ధి, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్‌ డి) పై దృష్టి, ఇన్నోవేషన్ సెంటర్స్ ఏర్పాటు, భవిష్యత్తులో ఈ నెట్‌వర్క్‌లను ఎలా అమలు చేయాలన్న దానిపై ప్రణాళికలు ఉన్నాయి. ప్రధాన లక్ష్యం విదేశీ టెలికాం ప్రొవైడర్స్ పై ఆధారపడకుండా స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి చేయడం. 6జీ కోసం భారత ప్రభుత్వం స్పెక్ట్రమ్ టెస్టింగ్, డెవలప్‌మెంట్ కు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తోంది. ఈ ప్రణాళికను మూడు దశలుగా విభజించారు..

  • షార్ట్ టర్మ్ 2025–2026
  • మిడ్ టర్మ్ 2027–2030
  • లాంగ్ టర్మ్ 2031–2035

ఈ దశల ప్రణాళిక పరిశోధకులు అధునాతన 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. దీనికి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) అధ్యయనాలను ఆధారంగా తీసుకున్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్స్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ భారతదేశం 6జీ అమలులో ప్రపంచంలో ముందుండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 2030 నాటికి 6జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.

6జీ ప్రయోజనాలు

పరిశోధనల ప్రకారం 6జీ నెట్‌వర్క్‌లు ప్రస్తుత 5జీ నెట్‌వర్క్స్ కంటే దాదాపు 10 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందించగలవు. దీని ద్వారా అల్ట్రా ఫాస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, రియల్ టైమ్ హోలోగ్రామ్స్, స్మార్ట్ సిటీ టెక్నాలజీ, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ అధునాతన ఏఐ నెట్‌వర్క్స్ వంటి సేవలు సాధ్యమవుతాయి. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ మరిన్ని రిసెర్చ్ ప్రాజెక్ట్స్ తో డిజిటల్ కనెక్టివిటీలో తదుపరి దశకు భారతదేశం బలమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ నిర్మించడానికి సిద్ధమవుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us