ఇంటికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మంది దుర్మరణం..
మహారాష్ట్రలోని ముంబై-పూణే పాత రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. రాయగఢ్ జిల్లాలోని ఖోపోలి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్రలోని ముంబై-పూణే పాత రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. రాయగఢ్ జిల్లాలోని ఖోపోలి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అదుపు తప్పిన బస్సు కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. గోరేగాం ప్రాంతానికి చెందినవారు పూణేలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని.. వెంటనే సహాయక చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. క్రేన్తో బస్సును బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. బస్సులో చిక్కున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు 25 మందిని రెస్క్యూ చేసినట్టు అధికారులు తెలిపారు. కాలువే అయినా లోయ తరహాలో ఉండడంతో సహాయకచర్యలు కష్టంగా మారాయని అధికారులు తెలిపారు.
పూణేలోని పింపుల్ గురవ్ నుంచి గోరెగావ్కు బస్సు వెళ్తుండగా పూణె-రాయ్గఢ్ సరిహద్దులో తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగిందని.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారని రాయ్గఢ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారు. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరికొంతమంది ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..