AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షం పడుతున్న సమయంలో స్నానం చేస్తున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

వర్షం కురుస్తుంటే చల్లగా అనిపించి మనం తడిసిపోవాలనుకుంటాం. కానీ ఆ వర్షం మామూలుగా కాకుండా.. మేఘగర్జనలతో వస్తే మాత్రం జాగ్రత్త అవసరం. వర్షం వస్తోందంటే స్నానం చేద్దామనుకోవడం సహజమే. కానీ ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు మెరుస్తూ గర్జనలు వినిపిస్తుంటే.. అది మన ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. ఈ విషయంలో శాస్త్రీయంగా ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షం పడుతున్న సమయంలో స్నానం చేస్తున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?
Bathing
Prashanthi V
|

Updated on: Jun 13, 2025 | 3:16 PM

Share

మేఘగర్జనల మధ్య వర్షం కురుస్తుంటే మనం మామూలు పనులు చేసుకోవడం కూడా ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా ఇంట్లో స్నానం చేయడం, పాత్రలు కడగడం లాంటి నీటి సంబంధిత పనులు చేయకూడదు. ఎందుకంటే నీరు, లోహపు పైపులు లాంటి పదార్థాలు విద్యుత్‌ ను ఎటువంటి నిరోధం లేకుండా ప్రసరింపజేస్తాయి. ఇదే విషయాన్ని అమెరికాలోని రోగ నియంత్రణ నివారణ కేంద్రం (CDC) కూడా హెచ్చరిస్తోంది.

విద్యుత్ వేగంగా అతి తక్కువ సమయానికి భూమిని తాకే ప్రక్రియే మెరుపు. ఇది సాధారణంగా ఎత్తైన భవనాలపై పడే అవకాశం ఉంటుంది. భవనం లోపల ఉన్న ప్లంబింగ్ వ్యవస్థ లేదా విద్యుత్ కనెక్షన్‌ లను అనుసరించి ఇంట్లోకి విద్యుత్ ప్రవేశిస్తుంది. మీరు ఆ సమయంలో బాత్‌ రూమ్‌ లో ఉంటే నీటి ద్వారా ఆ విద్యుత్ మీ శరీరానికి తాకే ప్రమాదం ఉంటుంది. ఈ రకంగా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.

చాలా మందికి ఒక ఆలోచన వస్తుంది.. మా ఇంట్లో ప్లాస్టిక్ పైపులే ఉన్నాయి కదా.. మేము సేఫ్ కదా అని. నిజానికి ప్లాస్టిక్ పైపులు మెటల్ పైపుల కంటే ప్రమాదం తక్కువే అయినా.. వాటి ద్వారా వెళ్లే నీరు కొన్ని సార్లు విద్యుత్‌ ను సంక్రమింపజేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకే ప్లాస్టిక్ పైపులు వాడుతున్నా 100 శాతం రక్షణ లభిస్తుంది అనుకోవడం తప్పు.

అలాంటి వాతావరణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. CDC సూచించిన అనేక భద్రతా సూచనల్లో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • వర్షం కురుస్తూ, మేఘగర్జనలు వినిపిస్తున్న సమయంలో స్నానం చేయకుండా ఉండాలి.
  • పాత్రలు కడగకూడదు.
  • ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకుండా ఉండాలి.
  • కిటికీలు, తలుపుల దగ్గర నిలబడకూడదు.
  • వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ లాంటివి ఆ సమయంలో ఆపివేయాలి.

ఈ సూచనలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రమాదం నుంచి దూరంగా ఉంచుకోవచ్చు. ఉరుములతో కూడిన వర్షం సమయంలో నీటి సంబంధిత పనులన్నీ కాస్త సమయం ఆపివేయడమే ఉత్తమం. వర్షం పూర్తిగా ఆగిన తర్వాత కనీసం 30 నిమిషాలు గడిచాకే స్నానం చేయడం, పాత్రలు కడగడం మొదలుపెట్టాలి. ఇది చిన్న జాగ్రత్త అయినా మీ ప్రాణాలకు రక్షణ కలిగించగలదు.