AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabja Seeds: చిన్నగా ఉన్నాయని చులకన చేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే

సబ్జా గింజలు తినడం వల్ల అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసిన విషయమే.. కానీ వీటిని తీసుకునే క్రమంలో మనం చేసే కొన్ని తప్పుల కారణంగా వాటిని ప్రయోజనాలను మనం పొందలేము. కాబట్టి ఎయిమ్స్‌ వైద్య నిపుణుల ప్రకారం వాటిని ఎలా తీసుకుంటే ప్రయోజనాలను పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

Sabja Seeds: చిన్నగా ఉన్నాయని చులకన చేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే
Sabja Seeds
Anand T
|

Updated on: Oct 13, 2025 | 7:21 AM

Share

సబ్జా గింజలను తులసి గింజలు అని కూడా పితుస్తారు. ఇవి చూడటానికి చిన్నగా కనిపించవచ్చు కానీ వాటి ప్రయోజనాలు మాత్రం అపారమైనవి. వీటిలో ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలు జీర్ణక్రియ, బరువు నియంత్రణకు సహాయపడటమే కాకుండా, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో, రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే వీటిని సరైన క్రమంలో తీసుకుంటేనే వాటి ప్రయోజనాలను పొందగలమని AIIMS, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు.

మొదటగా సబ్జా గింజల వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం

రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ నియంత్రణ: సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, భోజనం తర్వాత చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎముకలను బలపరుస్తుంది: సబ్జా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. అలాగే శరీరంలోని పోషక లోపాన్ని తీరుస్తాయి

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: సబ్జా గింజలు బరువు తగ్గడానికి గొప్ప సహాయకారి. అవి తిన్న తర్వాత కడుపులో ఉబ్బి, కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తాయి. అతిగా తినకుండా నిరోధిస్తాయి. వాటిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి వాటిని తిన్న తర్వాత బరువు పెరిగే ప్రమాదం లేదు.

రోగనిరోధక శక్తి పెంచడం : సబ్జా గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

సబ్జా గింజలు తినడానికి సరైన మార్గం

డాక్టర్ సౌరభ్ సేథి మాట్లాడుతూ, కిసబ్జా గింజలను తినడానికి ముందు ఎల్లప్పుడూ నానబెట్టాలి. పొడి విత్తనాలను నేరుగా తినడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. వాటిని కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆపై రసం, కొబ్బరి నీళ్లు, పాలు లేదా పెరుగుతో కలపండి. ఆ తర్వాత వాటిని తీసుకోండి. ఇలా చేస్తే వాటి ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us