AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు.. డాక్టర్‌తో పని లేకుండానే..

రక్తపోటును అదుపులో ఉంచుకోవడం వల్ల స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఆపిల్‌ తీసుకోవడం ద్వారా మధుమేహం, రక్తపోటు రెండూ అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల పండ్లను మాత్రమే తినాల్సి ఉంటుంది.

ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు.. డాక్టర్‌తో పని లేకుండానే..
Fruits cl
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2024 | 6:39 PM

Share

మనం తినే ఆహారాలు నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మన ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం ఎంతో అవసరం.. ఇది మన శరీరానికి అవసరమైన చాలా పోషకాలను అందిస్తుంది. సీజనల్‌గా లభించే అన్ని రకాల పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులో ఆపిల్ అతి ముఖ్యమైనది. అంతేకాదు.. రోజుకో ఆపిల్‌ తింటే.. డాక్టర్‌తో పనిలేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆపిల్‌ తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. దీన్నితీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. షుగర్ లెవల్స్ కూడా పెరగవు.

ఆపిల్‌ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాదు.., ఆపిల్స్‌ ఫైబర్‌కు మంచి మూలం, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆపిల్స్ తినడం వల్ల అందులోని కాల్షియం మీ ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా సహాయపడుతుంది. అలాగే మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు.. ఆపిల్స్ తినటం వల్ల వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల పండ్లను మాత్రమే తినాల్సి ఉంటుంది. అలాటి సమయంలో యాపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తరచూగా చెబుతుంటారు. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండి, చక్కెర తక్కువగా ఉండే ఆపిల్ గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఆపిల్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలకు ఆరోగ్యం. వేసవిలో ఆపిల్స్‌ తినడం వల్ల డీహైడ్రేషన్ వచ్చే సమస్య కూడా తగ్గిపోతుంది.

చాలా మందిలో మధుమేహంతో పాటు అధిక రక్తపోటు కూడా ముప్పుగా మారుతోంది. ఈ సమస్యకు ఆపిల్స్ తినడం కూడా మేలు చేస్తుంది. ఆపిల్స్‌ తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం వల్ల స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఆపిల్‌ తీసుకోవడం ద్వారా మధుమేహం, రక్తపోటు రెండూ అదుపులో ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్