AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Mangoes: మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!..ఎందుకంటే..

మామిడి పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే, కొన్ని వ్యాధుల నుండి రక్షించే, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అవసరమైన పోషకాలు ఉన్నాయి. మామిడిపండ్లు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. మామిడి పండ్లు బరువు తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, తినడానికి ముందు మామిడికాయలను నీటిలో నానబెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

Soaked Mangoes: మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!..ఎందుకంటే..
Soaked Mangoes
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2024 | 11:09 PM

Share

వేసవిలో ఆనందం అంటే.. మామిడి పండ్లు వాటితో తయారు చేసుకునే వివిధ వంటకాలను ఆస్వాదించడం. మామిడి పండు అన్ని వయసుల వారు ఆనందించవచ్చు. మామిడి పండు అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది. మామిడి పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే, కొన్ని వ్యాధుల నుండి రక్షించే, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అవసరమైన పోషకాలు ఉన్నాయి. మామిడిపండ్లు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. మామిడి పండ్లు బరువు తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, తినడానికి ముందు మామిడికాయలను నీటిలో నానబెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

మామిడికాయలను తినడానికి ముందు నీళ్లల్లో నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల్లేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. ఫైటిక్ యాసిడ్‌ను తొలగిస్తుంది.. మామిడి పండ్లను తినే ముందు నానబెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటిలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి, శరీరంలో వేడిని కలిగించే అదనపు ఫైటిక్ యాసిడ్‌ను తొలగించడానికి వాటిని కత్తిరించే ముందు వాటిని నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి

2. దుమ్ము, పురుగుమందులను తొలగిస్తుంది.. మామిడికాయలను తినడానికి ముందు నానబెట్టడం వల్ల తినడానికి ముందు వాటిపై ఉన్న దుమ్ము, పురుగుమందులు తొలగిపోతాయి. వాటిని నీటిలో నానబెట్టడం వల్ల ఈ పదార్ధాలు బాగా నానిపోతాయి. దాంతో అదంతా తొలగించడం సులభం అవుతుంది.

3. వేడిని తగ్గించండి.. తినడానికి ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వలన మామిడి పండ్ల వల్ల కలిగే వేడిని తగ్గిస్తుంది. మామిడి పండ్లను కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టడం వల్ల వాటి థర్మోజెనిక్ లక్షణాలు, వేడిని ఉత్పత్తి చేసే గుణం తగ్గుతుంది.

4.హానికరమైన రసాయనాలు తొలగిపోతాయి… మామిడి పండ్లను తినడానికి ముందు వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టడం, పరిశుభ్రత, ఆరోగ్యానికి అవసరం. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల వాటిపై ఉన్న దుమ్ము లేదా హానికరమైన కణాలను తొలగిపోతాయి. వాటిని సరిగ్గా కడగకపోవడం వల్ల వాటి ఉపరితలంపై ఉన్న దుమ్ము, దూళి, కారణంగా అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది.

5. మృదువుగా చేయడం మామిడికాయలను తినడానికి ముందు వాటిని నీటిలో నానబెట్టడం చాలా అవసరం, ఎందుకంటే ఇది వాటి గుజ్జు, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. వాటిని సుమారు 30 నిమిషాలు నానబెట్టడం వల్ల చర్మం కాస్త మృదువుగా మారుతుంది. అప్పుడు మామిడి పండ్లను కోసుకోవడం సులభం అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..