Sensex today: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బీఎస్ఈ 81 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9 పాయింట్లు లాస్..

ఐటీ, బ్యాంక్స్ తదితర స్టాక్‌లు అమ్మకాలు కాస్త ఒత్తిడికి గురవడంతో స్వల్ప నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు.

Sensex today: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..  బీఎస్ఈ 81 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9 పాయింట్లు లాస్..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 5:30 PM

అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐటీ, బ్యాంక్స్ తదితర స్టాక్‌లు అమ్మకాలు కాస్త ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో సెన్సెక్స్ 81 పాయింట్లు నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 80.74 పాయింట్లు నష్టపోయి 48,093.32 వద్ద ముగిసింది. అటు, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఎన్ఎస్ఈ నిఫ్టీ 8.90 పాయింట్లు నష్టపోయి 14,137.35 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లో టైటాన్ 2 శాతం మేర అత్యధికంగా నష్టపోగా తర్వాతి స్థానాల్లో నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఐటిసి, కొటాక్ బ్యాంక్ తదితర షేర్లు ఉన్నాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైన్ సర్వ్, ఎల్‌అండ్‌టీ తదితర షేర్లు లాభాలతో ముగిశాయి.