AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 వరల్డ్‌కప్‌ 2026.. గిల్‌కు షాక్‌.. అక్షర్‌కు ప్రమోషన్‌!

టీ20 వరల్డ్‌కప్‌ 2026.. గిల్‌కు షాక్‌.. అక్షర్‌కు ప్రమోషన్‌!

Phani CH
|

Updated on: Dec 23, 2025 | 1:28 PM

Share

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టు ఖరారైంది. రోహిత్, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ తర్వాత అనేక కొత్త ముఖాలు జట్టులోకి వచ్చాయి. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయగా, అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ లభించింది. శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శన కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. స్పిన్నర్లకు ప్రాధాన్యతనిచ్చారు. ఈసారి టీమిండియా సరికొత్త కూర్పుతో బరిలోకి దిగనుంది.

వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 కోసం టీమిండియా ఆటగాళ్ల జాబితా ఖరారయింది. 2024 ప్రపంచకప్ గెలిచిన జట్టుతో పోలిస్తే ఈసారి టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల రిటైర్మెంట్ తర్వాత.. దాదాపు ఏడు కొత్త ముఖాలు ఈ మెగా టోర్నీలో కనిపించబోతున్నాయి. యువ ఆటగాళ్లపై నమ్మకంతో పాటు అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం విశేషం. ప్రపంచకప్‌తో పాటు వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు కూడా ఇవే జట్లను ఎంపిక చేశారు. ఈ ఎంపికలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్‌ల విషయంలో తీవ్ర చర్చ జరగగా, రింకూను ప్రధాన జట్టులోకి తీసుకుని జైస్వాల్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఉంచారు. అలాగే ఐపీఎల్‌లో మెరిసిన నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్‌లను కూడా బ్యాకప్ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరగనుండటంతో స్పిన్ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లను సెలెక్టర్లు జట్టులోకి ఆహ్వానించారు. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ప్రకటించిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్ పేరు లేకపోవడం క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత 15 అంతర్జాతీయ టీ20ల్లో గిల్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. కేవలం 291 పరుగులు మాత్రమే చేయడం, అందులోనూ ఒక్క ఫిఫ్టీ కూడా లేకపోవడం సెలెక్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది. గిల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతలను అక్షర్ పటేల్‌కు అప్పగించడం ద్వారా ఆల్ రౌండ్ సామర్థ్యం ఉన్న ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ నిర్ణయం చెబుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం

ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్‌

ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి

ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్‌ పిడిగుద్దులు.. కారణం

ఇలా అయిపోతున్నారేంట్రా.. హైవేపై బ్రిడ్జికి వేలాడుతూ పుల్‌అప్స్‌.. అక్కడ నుండి..