శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుమలలో అరుదైన పచ్చ రంగు నాగుపాము కనిపించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా బూడిద రంగులో ఉండే నాగుపాముతో పోలిస్తే ఈ పాము పచ్చగా ఉండడం ప్రత్యేకతగా గుర్తించారు. టీటీడీ ఫారెస్ట్ విభాగానికి చెందిన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఈ దాదాపు రెండు అడుగుల పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.