AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగటిపూట మాత్రం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ.. ఎందుకో తెలిస్తే షాక్..!

కర్ణాటకలో ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రాత్రిపూట అందరూ నిద్రపోతున్న సమయంలో ఇళ్లలోకి చొరబడి దోచుకున్న అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇక్కడ ఒక దొంగ పాట పాడుతూ ఇంట్లో దొంగతనం చేసిన ఆశ్చర్యకరమైన సంఘటన బయటపడింది. పోలీసలు విచారణలో సంచలన విషయాలు వెల్లడి అయ్యాయి.

పగటిపూట మాత్రం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ..  ఎందుకో తెలిస్తే షాక్..!
Arrest
Balaraju Goud
|

Updated on: Dec 23, 2025 | 1:29 PM

Share

కర్ణాటకలో ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రాత్రిపూట అందరూ నిద్రపోతున్న సమయంలో ఇళ్లలోకి చొరబడి దోచుకున్న అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇక్కడ ఒక దొంగ పాట పాడుతూ ఇంట్లో దొంగతనం చేసిన ఆశ్చర్యకరమైన సంఘటన బయటపడింది. రేచీకటి ఉన్న ఒక వ్యక్తి పట్టపగలు ఇళ్లలోకి చొరబడి డబ్బు, బంగారాన్ని దొంగిలించి చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు.

అరెస్టయిన నిందితుడు మహమ్మద్ ఖాన్. దొంగతనం తన వృత్తిగా ఎంచుకున్నాడు. అతను రేచీకటితో బాధపడుతున్నాడు. అందుచేత ఇతగాడు పగటిపూట ఇళ్లలోకి చొరబడి బంగారం, నగదు దోచేస్తున్నాడు. ఎందుకంటే అతనికి రాత్రిపూట కనిపించదు. ఉదయం ఇంట్లో ఎవరూ లేకుండా తాళం వేసి ఉన్న ఇళ్లపై అతని లక్ష్యం. ఖాళీగా ఉన్న ఇళ్ల కోసం అతను ఆ ప్రాంతంలో తిరుగుతూ దోచుకుంటున్నాడు. ఈక్రమంలోనే బెంగళూరులోని జెపి నగర్ నివాసి అయిన టెలివిజన్ నటుడు ప్రవీణ్ ఇంట్లో కూడా దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.

ప్రవీణ్ భార్య మేకప్ ఆర్టిస్ట్, వారిద్దరూ ఒక సీరియల్ షూటింగ్ లో ఉన్నప్పుడు, దొంగ ఇంట్లోకి చొరబడి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రవీణ్ జెపి నగర్ పోలీస్ స్టేషన్‌లో చోరీకి సంబంధించి ఫిర్యాదు చేశాడు, దొంగలు తమ ఇంటి నుండి సుమారు ఒకటిన్నర లక్షల బంగారు ఆభరణాలను దొంగిలించి పారిపోయాడని పేర్కొన్నారు. చివరికి పోలీసులు దొంగను అరెస్టు చేశారు. విచారణలో, అతను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో కూడా దొంగిలించాడని వెల్లడైంది. మొత్తంగా, ఏడు అంతర్ రాష్ట్ర దొంగతనాల కేసులలో రూ.46 లక్షల నగదు, రూ.65.28 లక్షల బంగారు ఆభరణాలు, 1 కిలో 550 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదిలావుంటే, బెంగళూరులోని సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఇంటి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. జైలులో కలిసిన బాలరాజ్, గౌరవ్, ప్రవీణ్ జైలు నుండి విడుదలైన తర్వాత దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు. అదేవిధంగా, సిద్ధాపూర్ పరిధిలోని వివిధ ఇళ్లలో రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.25 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..