AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల రాలిన 200లకు పైగా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులు (Heatwave) కేవలం మనుషులనే కాకుండా వన్యప్రాణులను, పక్షులను కూడా తీవ్రంగా వేధిస్తున్నాయి. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించిన ఒక అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన వేడిని తట్టుకోలేక దాదాపు 200 గబ్బిలాలు (Bats) ప్రాణాలు కోల్పోయాయి. చెట్ల మీద కాలిపోయిన అవి.. పండ్లలా రాలిపోతున్న దృశ్యాలు స్థానికుల్ని కలచివేస్తున్నాయి.

భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల రాలిన 200లకు పైగా
Bats Die Due To Heatwave
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: May 25, 2026 | 8:24 PM

Share

భానుడి ప్రతాపానికి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పక్షులు, జంతువుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో వడగాల్పుల ధాటికి ఏకంగా 200 గబ్బిలాలు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఒక్కసారిగా నేలకూలిన మూగజీవాలు:

సాధారణంగా చెట్లకు తలకిందులుగా వేలాడుతూ ఉండే గబ్బిలాలు, ఎండ వేడిమిని తాళలేక ఒక్కసారిగా నేలరాలాయి. వందల సంఖ్యలో గబ్బిలాలు చెట్ల కింద ప్రాణాలు విడిచి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఒకే ప్రాంతంలో ఇలా భారీ సంఖ్యలో గబ్బిలాలు చనిపోవడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది.

గత కొద్ది రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఎండల తీవ్రత, అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ గబ్బిలాలు మృతి చెంది ఉంటాయని సంబంధిత అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వేడిమిని తట్టుకోలేక ఈ మూగజీవాలు ప్రాణాలు విడిచాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రోజురోజుకూ మారుతున్న వాతావరణ పరిస్థితులు వన్యప్రాణుల మనుగడకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం అడవి జంతువులు, పక్షులపై తీవ్రంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలను కాపాడుకునేందుకు పర్యావరణ పరిరక్షణ చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు
డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్..
డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్..
దేశంలోనే తొలిసారి.. ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ యాప్ ప్రారంభం
దేశంలోనే తొలిసారి.. ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ యాప్ ప్రారంభం
గాలివానకు టోల్‌గేట్ హాంఫట్..
గాలివానకు టోల్‌గేట్ హాంఫట్..
ఎండల్లో లీటర్ల కొద్దీ నీళ్లు తాగినా నీరసం తగ్గట్లేదా..
ఎండల్లో లీటర్ల కొద్దీ నీళ్లు తాగినా నీరసం తగ్గట్లేదా..
ఈ జబర్దస్త్ కమెడియన్ కష్టాలు పగోడికి కూడా రావొద్దు..
ఈ జబర్దస్త్ కమెడియన్ కష్టాలు పగోడికి కూడా రావొద్దు..