MS Dhoni retirement: రాంచీలో ధోనీకి ఫేర్వెల్ మ్యాచ్ !
భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. భారత క్రికెట్ టీమ్కు అడపాదడపాగా దక్కే విజయాలను అలవాటుగా మార్చేసిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సైలెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్కి శనివారం గుడ్ బై చెప్పేశాడు.
MS Dhoni retirement: భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. భారత క్రికెట్ టీమ్కు అడపాదడపాగా దక్కే విజయాలను అలవాటుగా మార్చేసిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సైలెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్కి శనివారం గుడ్ బై చెప్పేశాడు. ఇండియాకి 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన మహేంద్రుడు.. క్రికెట్ ప్రపంచంలో ఈ మూడు ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇండియాకి ఇంత గొప్ప విజయాలు ఆటగాడు చడీచప్పుడు లేకుండా రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది.
గౌరవ సూచకంగా ధోనీకి ఫేర్వెల్ మ్యాచ్ని ఏర్పాటు చేయాలని తాజాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరన్ డిమాండ్ చేశారు. ‘‘ఝార్ఖండ్కి చెందిన ధోనీ మళ్లీ భారత జెర్సీ వేసుకోవడాన్ని మేము చూడలేం. మేమే కాదు.. భారతదేశం మొత్తం అతడ్ని చివరిగా ఒక్కసారి టీమిండియా జెర్సీతో చూడాలని కోరుకుంటుంది. కాబట్టి.. దయచేసి బీసీసీఐ ధోనీకి ఓ ఫేర్వెల్ మ్యాచ్ని ఝార్ఖండ్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నా. వరల్డ్ అంతా ధోనీ వీడ్కోలుని చూడాలి’’ అని పేర్కొన్నారు.
భారత్కి ధోనీ సారథిగా మారిన తర్వాతే ఝార్ఖండ్ మైదానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో బీసీసీఐ డెవలప్ చేసింది. దాంతో.. ఇప్పుడు ఆ స్టేడియం అంతర్జాతియ మ్యాచ్లకి ఆతిథ్యమిస్తోంది. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ భారత క్రికెట్ టీమ్కి దూరంగా ఉన్నప్పటికీ.. తరచూ ఝార్ఖండ్ స్టేడియానికి వెళ్లి బ్యాటింగ్ సాధన చేసేవాడు.
Also Read :
విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు