వాజ్ పేయికి ప్రధాని మోదీ ఘన నివాళి

దివంగత మాజీ ప్రధాని ఏబీ వాజ్ పేయి రెండో వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. పుణ్య తిథి రోజున ఆయన కన్ను మూశారని, ఈ దేశ అభ్యున్నతికి, చేసిన..

వాజ్ పేయికి ప్రధాని మోదీ ఘన నివాళి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2020 | 9:31 AM

దివంగత మాజీ ప్రధాని ఏబీ వాజ్ పేయి రెండో వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. పుణ్య తిథి రోజున ఆయన కన్ను మూశారని, ఈ దేశ అభ్యున్నతికి, చేసిన సేవలకు స్మృతి చిహ్నంగా ఆయనను స్మరించుకుంటున్నామని మోదీ పేర్కొన్నారు. వాజ్ పేయికి సంబంధించిన ఫొటోలతో కూడిన సుమారు రెండు నిముషాల మోంటేజీని మోదీ విడుదల చేశారు. ఈ దేశం మీ త్యాగ నిరతిని ఎన్నటికీ మరువబోదని, మీ హయాంలో ఇండియా అణు శక్తిగా ఎదిగిందని ఆయన అన్నారు. రాజకీయ వేత్తగా, ఎంపీగా, ప్రధానిగా మీరు ఈ దేశానికి అమూల్యమైన సేవలను అందించారని అన్నారు. తను యుక్త వయస్సులో ఉన్నప్పుడు వాజ్ పేయి నుంచి ఆశీస్సులు అందుకుంటున్న ఫోటోలను కూడా ఆయన ఇందులో చేర్చారు. 2018 ఆగస్టు 16 న వాజ్ పేయి దివంగతులయ్యారు.