AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ వలనే కోలుకున్నా.. ప్లాస్మా డోనర్‌ కాళ్లు కడిగిన డిప్యూటీ స్పీకర్

కరోనా మహమ్మారిపై పోరాటంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు ప్లాస్మా డోనర్లు. తమ ప్లాస్మాను దానం చేయడం వలన పలువురి ప్రాణాలు కాపాడుతున్నారు.

నీ వలనే కోలుకున్నా.. ప్లాస్మా డోనర్‌ కాళ్లు కడిగిన డిప్యూటీ స్పీకర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 16, 2020 | 10:31 AM

Share

Laskar washes plasma donor feet: కరోనా మహమ్మారిపై పోరాటంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు ప్లాస్మా డోనర్లు. తమ ప్లాస్మాను దానం చేయడం వలన పలువురి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని పలువురు పిలుపునిస్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు ప్లాస్మాను దానం‌ చేసే వారికి ప్రోత్సహకాలను కూడా అందిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో తనకు ప్లాస్మాను దానం చేసిన ఓ వ్యక్తి కాళ్లను అసోం డిప్యూటీ స్పీకర్‌ అనిముల్‌ హకే లష్కర్‌ కడిగారు. ఇటీవల లష్కర్‌ కరోనా బారిన పడగా‌.. ప్లాస్మా దానంతో ఆయన త్వరగా కోలుకున్నారు. ఈ క్రమంలో తను కోలుకునేలా చేసిన వ్యక్తి కాళ్లను ఆయన కడిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ప్లాస్మా డోనర్లు ఎంతోమందికి జీవితాలను ఇస్తున్నారు. ఓ వ్యక్తి ప్లాస్మా దానంతో నేను బతుకుతానని ఎప్పుడూ అనుకోలేదు. మనం దేవుడిని చూడలేదు. కానీ ప్లాస్మా డోనర్లు దేవుడి కంటే తక్కువైన వారు కాదు. ఇప్పుడు వారే మనకు దేవుళ్లు. ఇవాళ నేను బతికి ఉన్నానంటే దానికి కారణం నాకు ప్లాస్మా దొరకడమే. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా బరాక్ వ్యాలీలో ప్లాస్మాను దానం చేసే వారి కాళ్లను కడగాలనుకున్నా. వారు ఏ మతానికి, ఏ కులానికి చెందిన వారైనా నేను కాళ్లు కడగాలనుకున్నా” అని అన్నారు. కాగా జూలై 28న కరోనా బారిన పడిన లష్కర్‌ ఈ నెల 8న కోలుకున్నారు.

Read More:

కాఫీ పొడితో ‘గాంధీ బొమ్మ’.. వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన తమిళనాడు టీచర్‌

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1102 కొత్త కేసులు.. 9 మరణాలు