AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Tips: మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత నిద్ర ముంచుకొస్తుందా? అయితే, ఇలా కంట్రోల్ చేసుకోండి..

పగటిపూట నిద్ర మత్తు సమస్యను ఎదుర్కోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా నిద్ర మబ్బు, మగతగా ఫీల్ అయి ఉంటారు. స్కూల్‌లో, కాలేజీలో, ఆఫీసులో,

Sleeping Tips: మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత నిద్ర ముంచుకొస్తుందా? అయితే, ఇలా కంట్రోల్ చేసుకోండి..
Sleeping After Lunch
Shiva Prajapati
|

Updated on: Oct 19, 2022 | 4:04 PM

Share

పగటిపూట నిద్ర మత్తు సమస్యను ఎదుర్కోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా నిద్ర మబ్బు, మగతగా ఫీల్ అయి ఉంటారు. స్కూల్‌లో, కాలేజీలో, ఆఫీసులో, ఇంట్లో ఉన్నా ఆకస్మికంగా నిద్ర ముంచుకొస్తుంది. అలా గాఢ నిద్రలోకి జారుకుంటారు. మధ్యాహ్నం భోజనం తరువాత ఈ నిద్ర ఎక్కువగా వస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు నిద్రపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. మధ్యాహ్నం భోజనం తరువాత నిద్ర రావడం అనేది మన శరీరంలో జీవక్రియ ప్రభావం వలన ఉంటుంది. మరి లంచ్ చేసిన తరువాత నిద్ర ఎందుకు వస్తుంది? మబ్బుగా ఎందుకు ఉంటుంది? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మధ్యాహ్నం నిద్రపోవడానికి కారణం ఏంటి?

మధ్యాహ్నం భోజనం తరువాత నిద్రపోవడం అనేది తినే ఆహారంతో తక్కువ సంబంధాన్ని కలిగి ఉంటుంది. శరీరం సహజంగానే నిద్రపోవాలనుకున్నప్పుడు.. దీనికి కారణమయ్యే రెండు దృగ్విషయాలు ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం.

హార్మోన్ ప్రభావం: మెదడులో ఉండే అడెనోసిస్ అనే హర్మోన్ మనం మెలకువగా ఉన్నా కొద్ది క్రమంగా పెరుగుతుంది. ఈ హార్మోన్ నిద్రవేళకు ముంద గరిష్ట స్థాయిలోకి చేరుతుంది. ఉదయం కంటే మధ్యాహ్నం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అడెనోసిస్ ఎక్కువగా ఉంటే.. మన మెదడు ఆటోమాటిక్‌గా నిద్ర కోరుకుంటుంది. మగతగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సిర్కాడియన్ రిథమ్: సిర్కాడియన్ రిథమ్ అనేది పరోక్షంగా అలసటను కలిగించే రెండవ ప్రక్రియ. గడియారం మాదిరిగానే, మనం మేల్కొని నిద్రపోతున్నప్పుడు సర్కాడియన్ రిథమ్ నియంత్రిస్తుంది. శరీరంలో హార్మోన్లు, ఇతర ప్రక్రియల ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా చురుకుగా ఉండేందుకు ఇది రోజంతా సహకరిస్తుంది. అయితే, చాలా మంది భోజన సమయానికి 7-9 గంటల ముందు మేల్కోవడం వల్ల అధిక మొత్తంలో అడెనోసిస్ పెరగడంతో పాటు.. సిర్కాడియన్ రిథమ్‌ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఈ మార్పుల కారణంగా కూడా మగతగా, అలసిపోయినట్లుగా ఉంటుంది.

భోజనం తరువాత మగతగా అనిపిస్తే ఇలా చేయండి..

తిన్న తరువాత నడవాలి: మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే పని చేయొద్దు. కాసేపు అటూ ఇటూ నడవాలి. లేదా మెట్ల మార్గం ద్వారా నడవాలి. ఈ శీఘ్ర వ్యాయామం రక్తంలోని ఆక్సీజన్ కంటెంట్‌ను పెంచడానికి , మరింత శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది.

నీరు తాగాలి: అలసట, విచారం, ఏకాగ్రతా లోపం ఇవన్నీ డీహైడ్రేషన్ లక్షణాలు. రోజులో సరిపడా నీరు తాగడానికి ప్రయత్నించాలి. మధ్యాహ్నం భోజనం తరువాత మగత సమస్యను నివారించడానికి శరీరం హైడ్రేట్‌గా ఉండటం అవసరం. అందుకే, మంచినీరు తాగాలి.

తక్కువగా తినాలి: అతిగా తినడం వల్ల త్వరగా మగత సమస్య వస్తుంది. ఎందుకంటే ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. నిద్ర రావడంతో పాటు, నీరసంగా కూడా ఉంటుంది. అలా అనిపించకుండా ఉండాలంటే అతిగా తినడం నియంత్రించుకోవాలి. తక్కువ తక్కువగా మధ్య మధ్యలో ఆహారం తినాలి.

భోజనాన్ని ట్రాక్ చేయాలి: మధ్యాహ్నం తినే భోజనాన్ని ట్రాక్ చేయాలి. నిద్ర, నీరసంగా అనిపించేలా ఉండే భోజనం ఏదో కనిపెట్టాలి. అలా గుర్తించి.. మరోసారి ఆ భోజనాన్ని తీసుకోవడం తగ్గించాలి. శక్తిని పెంచే వేరే ఆహారాన్ని తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ