Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్క హీరోయినే అక్కినేని ముగ్గురు హీరోలను కవర్ చేసిందా.!! ఆమె ఎవరంటే

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. సినీరంగంలో అక్కినేని లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు నాగార్జున. దివంగత హీరో నాగేశ్వర రావు నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ అందకున్నారు. 80, 90’s లో నాగార్జున క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

ఈ ఒక్క హీరోయినే అక్కినేని ముగ్గురు హీరోలను కవర్ చేసిందా.!! ఆమె ఎవరంటే
Akkineni Heroes
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 06, 2025 | 4:22 PM

అక్కినేని ఫ్యామిలీ హీరోలు సాలిడ్ హిట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు కింగ్ నాగార్జున, మరో వైపు ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నారు. నాగార్జున చివరిగా నటించిన  నా సామిరంగ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ఆతర్వాత బిగ్ బాస్ షో హోస్ట్ గా చేసి ఆకట్టుకున్నారు నాగ్. ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలోనూ నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీ రోల్ లో నాగ్ కనిపించనున్నారు.

ఇక నాగ చైతన్య తండేల్ సినిమాతో రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు అఖిల్ కూడా నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అఖిల్ నాటింషన్ ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు అఖిల్. ఇదిలా ఉంటే అక్కినేని ముగ్గురు హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.? ఇండస్ట్రీలో తండ్రి కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కాగా అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ మాత్రం ఈ అమ్మడే.. ఆమె బుట్టబొమ్మ పూజాహెగ్డే.

ఇవి కూడా చదవండి

అవును పూజాహెగ్డే నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేసింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసింది. అదేవిధంగా నాగార్జునతో సినిమాల్లో నటించలేదు కానీ యాడ్స్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ చిన్నది. నాగ్, పూజా కలిసి కొన్ని యాడ్స్ చేశారు. ఇలా బుట్టబొమ్మ పూజా హెగ్డే అక్కినేని ముగ్గురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ అమ్మడు వరుస ఫ్లాప్స్ పలకరించడంతో స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం పూజా హెగ్డే దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.