AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay: ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమేంటో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు నాట ఈ హీరోకు అశేషమైన అభిమానులు ఉన్నారు. ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ స్థాపించారు. ఇటీవల పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించారు. ఇక రాజకీయాల కోసం భవిష్యత్‌లో సినిమాలకు స్వస్తి చెప్పడానికి కూడా సిద్ధం అయ్యాడీ స్టార్ హీరో.

Thalapathy Vijay: ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమేంటో తెలుసా?
Thalapathy Vijay
Basha Shek
|

Updated on: Aug 31, 2024 | 9:56 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు నాట ఈ హీరోకు అశేషమైన అభిమానులు ఉన్నారు. ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ స్థాపించారు. ఇటీవల పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించారు. ఇక రాజకీయాల కోసం భవిష్యత్‌లో సినిమాలకు స్వస్తి చెప్పడానికి కూడా సిద్ధం అయ్యాడీ స్టార్ హీరో. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవడానికి చెన్నై నుంచి మహారాష్ట్రకు ప్రైవేట్ జెట్‌లో వెళ్లారట. మరి కొద్ దిరోజుల్లో ప్రజల దగ్గరకు విజయ్‌ వెళ్లబోతున్నారు. ఈ క్రమంలో ముందుగా షిరిడీ సాయిబాబాను దర్శించుకోవాలని తన తల్లి శోభ సూచించడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయ్‌ తల్లి శోభ సాయిబాబా భక్తురాలు. ఆమ్మపై ప్రేమతో కొద్ది రోజుల క్రితం చెన్నైలో సాయిబాబా గుడి కూడా నిర్మించారు విజయ్. లారెన్స్ లాంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. కాగా

కాగా ఇటీవలే పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్‌ సెప్టెంబర్‌ 23న తిరుచ్చిలో మొట్ట మొదటి సారిగా మానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట. అంతకు ముందే షిరిడీ సాయినాథుడిని దర్శించుకుంటే బాగుంటుందని తల్లి సూచించడంతో ఆయన ప్రైవేట్ జెట్ లో మహారాష్ట్రకు వెళ్లారట.

ఇవి కూడా చదవండి

ఇక విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం గోట్‌ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. నటుడు మైక్‌ మోహన్, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్, నటి మీనాక్షీ చౌదరి, స్నేహా, లైలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన అల్లరి నరేష్..
ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన అల్లరి నరేష్..
ఇల్లు కొనేకంటే బెస్ట్ ఐడియా ఇది.. ఓ సారి చూసేయండి.
ఇల్లు కొనేకంటే బెస్ట్ ఐడియా ఇది.. ఓ సారి చూసేయండి.
తెల్ల జుట్టు నల్లగా మారాలా.. పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోని..
తెల్ల జుట్టు నల్లగా మారాలా.. పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోని..
ప్లేఆఫ్స్ రేసులో దూసుకొచ్చిన చెన్నై.. టాప్-4 చేరాలంటే ఏం చేయాలి?
ప్లేఆఫ్స్ రేసులో దూసుకొచ్చిన చెన్నై.. టాప్-4 చేరాలంటే ఏం చేయాలి?
కోహ్లీకి కోలుకోలేని దెబ్బ.. ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్ వెనక్కి
కోహ్లీకి కోలుకోలేని దెబ్బ.. ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్ వెనక్కి
స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
నెక్ట్స్ టార్గెట్‌ తెలంగాణే.. మోదీ సభతో బీజేపీ నేతల్లో కొత్త జోష్
నెక్ట్స్ టార్గెట్‌ తెలంగాణే.. మోదీ సభతో బీజేపీ నేతల్లో కొత్త జోష్
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
మీరు స్నానం చేసే నీటిలో ఆ ఆకులు వేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
మీరు స్నానం చేసే నీటిలో ఆ ఆకులు వేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
120 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 18 ఏళ్ల కుర్రాడు.. అరంగేట్రంలోనే
120 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 18 ఏళ్ల కుర్రాడు.. అరంగేట్రంలోనే