30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన హీరో మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె!

తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన  'ఎన్నుయిర్ తోజన్' (1990) చిత్రంతో హీరోగా పరిచయం అయిన నటుడు బాబు గుర్తున్నాడా? ఈ మువీలో మురికి వాడలో నివసించే రాజకీయ కార్యకర్తగా అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మువీ సూపర్ హిట్ కొట్టడంతో ఒకేసారి పది సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటన్నింటికీ కూడా నటుడు బాబు సంతకాలు చేశారు. అలా సంతకాలు చేసిన సినిమాల్లో 'మనసారా వస్తుంగలేన్‌' కూడా ఒకటి. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో..

30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన హీరో మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె!
Tamil Actor Babu
Follow us

|

Updated on: Oct 13, 2023 | 2:59 PM

తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన  ‘ఎన్నుయిర్ తోజన్’ (1990) చిత్రంతో హీరోగా పరిచయం అయిన నటుడు బాబు గుర్తున్నాడా? ఈ మువీలో మురికి వాడలో నివసించే రాజకీయ కార్యకర్తగా అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మువీ సూపర్ హిట్ కొట్టడంతో ఒకేసారి పది సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటన్నింటికీ కూడా నటుడు బాబు సంతకాలు చేశారు. అలా సంతకాలు చేసిన సినిమాల్లో ‘మనసారా వస్తుంగలేన్‌’ కూడా ఒకటి. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు బాబు కొన్ని ఫైట్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించాడు. ఈ క్రమంలో ‘మనసారా వస్తుంగలేన్‌’ సినిమా షూటింగ్‌ తీస్తున్న సమయంలోనే అనుకోని ప్రమాదం ఆయన్ని వెంటాడింది.

డూప్‌ లేకుండా ఎత్తైన కొంతమీద నుంచి అమాంతం దూకేశాడు. అయితే కింద అమర్చిన సేఫ్టీ ట్రాక్‌లో కాకుండా వేరేచోట పడిపోయాడు. హీరోగా ఎదుకుగున్న టైంలో జరిగిన ఈ ప్రమాదం నటుడి జీవితాన్ని తలకిందులు చేసింది. తమిళ చిత్ర సీమలో అగ్రహీరోగా ఎదగగలిగిన సత్తా ఉన్న నటుడు బాబు ఈ ప్రమాదం తర్వాత చలనం లేకుండా మంచానికే పరిమితం అయ్యాడు. ఈ ప్రమాదంలో బాబు వెన్నెముక విరిగిపోయింది. ఆపరేషన్‌ చేయించుకున్నప్పటికీ కూర్చోలేక పోయేవాడు. అలా దాదాపు 30 ఏళ్లపాటు మంచాన ఉన్న బాబు గతనెల (సెప్టెబర్‌) 19న అనారోగ్యంతో కన్నుమూశాడు. నటుడు బాబు మరణం అతని తల్లి ప్రేమని తీవ్రంగా కలచివేసింది. 3 శతాబ్ధాలుగా కొడుక్కి నిద్రహారాలు మాని సపర్యలు చేసిన ఆ తల్లి కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రేమ బుధవారం (అక్టోబర్‌ 11) కూడా కన్నుమూసింది. కొడుకు చనిపోయిన మూడు వారాలకే తల్లి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

బాబు తల్లి ప్రేమ ఎవరో కాదు.. తమిళనాడు మాజీ అసెంబ్లీ స్పీకర్ కె రాజారాంకు ఆమె స్వయానా సోదరి. ఇన్నాళ్లూ తన కొడుకును చూసుకున్న ఆ తల్లి కొడుకు మరణించడంతో గుండె పగిలిపోయింది. దీంతో పూర్తిగా దుఃఖంలో మునిగిపోయిన ఆమె ఆహారం తీసుకోవడానికి నిరాకరించింది. ఈ క్రమంలోనే పూర్తిగా నీరసించి ఆమె మరణించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.