AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Producer Ashwini Dutt: ‘ఆ సినిమాతో కోలుకోలేని దెబ్బతగిలింది.. సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నాను’

సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తన కెరీర్‌లో ఒక సినిమా వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినీ పరిశ్రమలో ఎదురు దెబ్బలు తగలడం సహజమేనని, ఐతే వాటిని ఎదుర్కొని ముందుకు..

Producer Ashwini Dutt: 'ఆ సినిమాతో కోలుకోలేని దెబ్బతగిలింది.. సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నాను'
Film Producer Ashwini Dutt
Srilakshmi C
|

Updated on: May 05, 2023 | 7:15 AM

Share

సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తన కెరీర్‌లో ఒక సినిమా వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినీ పరిశ్రమలో ఎదురు దెబ్బలు తగలడం సహజమేనని, ఐతే వాటిని ఎదుర్కొని ముందుకు అడుగులేస్తుంటామని ఆయన అన్నారు. ఐతే తన కెరీర్‌లో ఆ ఒక్క సినిమా వల్ల కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు.

2011 సంవత్సరంలో అశ్విని దత్ ఎన్టీఆర్‌తో చేసిన భారీ బడ్జెట్ చిత్రం శక్తి. ఐతే ఆ మువీ అతి పెద్ద డిజాస్టర్‌ కావడంతో నిర్మాత అశ్వినీదత్‌ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ మువీని 40 – 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అప్పట్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న భారీ ప్రాజెక్ట్ అది. శక్తి సినిమా వాల్ల రూ.32 కోట్ల నష్టం రావడంతో సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నానని ఆయన తెలిపారు. తన కెరీర్‌లో అది మామూలు విషయం కాదన్నారు. ‘శక్తి’ మువీ పరాజయం పాలవడం చాలా షాకింగ్‌గా అనిపించిందని.. అందుకే నాలుగైదేళ్ల పాటు సినిమాలు తీయాలని అనిపించలేదని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కాగా అశ్వినీదత్‌ ప్రస్తుతం వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, దీపిక పదుకొణె నటీనటులుగా ‘ప్రాజెక్ట్‌-కె’ (వర్కింగ్‌ టైటిల్‌) మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.