Hyderabad Crime: చార్మినర్‌ వద్ద నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య.. రూ.10 వేల పంచాయితీ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం (మే 4) దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు గేట్ నంబర్ 6 వద్ద నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య..

Hyderabad Crime: చార్మినర్‌ వద్ద నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య.. రూ.10 వేల పంచాయితీ..
Hyderabad Crime
Follow us

|

Updated on: May 04, 2023 | 12:11 PM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం (మే 4) దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు గేట్ నంబర్ 6 వద్ద నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. వివరాలోకెళ్తే..

హైదరాబాద్‌ చార్మినర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద రూ.10 వేల కోసం ఇద్దరు వ్యక్తుల ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపోధ్రిక్తుడైన ఓ వ్యక్తి మరో వ్యక్తిని అందరూ చూస్తుండగానే కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. దీనితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే మిథున్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చేయండి.