నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ
దేశవ్యాప్తంగా నకిలీ మందుల దందా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ పోలీసుల దాడుల్లో పాట్నాలో ఒక భారీ ఫ్యాక్టరీతో పాటు విజయవాడలో గడువు ముగిసిన మందుల రీప్యాకింగ్ ముఠా గుట్టురట్టయింది. పదిమందికి పైగా నిందితులు అరెస్టు కాగా, ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిన ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
పాలు, నూనె వంటి నిత్యావసర వస్తువులే కాకుండా, ప్రజల ప్రాణాలను నిలబెట్టే ఔషధాలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కిరాతకులు. ఢిల్లీ నుండి గల్లీ వరకు విస్తరించిన ఈ మాయదారి మందుల దందా ప్రజారోగ్య భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. తాజాగా ఢిల్లీ పోలీసులు బీహార్ రాజధాని పాట్నాలో ఒక నకిలీ మందుల తయారీ ఫ్యాక్టరీని గుట్టురట్టు చేశారు. పెద్దమొత్తంలో నకిలీ మాత్రలు, సిరప్లు, ఖాళీ సీసాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందులో 13 కేజీలకు పైగా ట్రమడాల్ పౌడర్, ఆల్ఫ్రాజోలమ్లు లభ్యమయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణాలో వర్షాలు.. జలమయమైన కాలనీలు..నీటమునిగిన రోడ్లు
ఏడుకొండల వాడి చెంత ఇక గోల్డెన్ థంబ్ రూల్
ఉగ్రవాదంపై ఉక్కుపాదానికి కేంద్రం కొత్త పాలసీ
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్ న్యూస్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

