Rana Daggubati: విరాట పర్వం తీసిన తర్వాతే ఆ విషయం తెలిసింది.. రానా ఆసక్తికర కామెంట్స్..
సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీలో రానా నక్సలైట్ రవన్న
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా..డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం (Virata Parvam) సినిమా జూన్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీలో రానా నక్సలైట్ రవన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్తో సినిమా ఏ రెంజ్లో ఉండబోతుందో తెలియజేశారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ లాంచ్, ఆత్మీయ వేడుక అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రయూనిట్.. ఇక నిన్న బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ.. మా చిన్నాన్న లేకుండా ఇంట్లో అయినా.. ప్రొఫెషనల్ గా అయినా ఏ ఫంక్షన్ జరగదు అంటూ చెప్పుకొచ్చారు.
రానా మాట్లాడుతూ.. నిజాయితీతో డైరెక్టర్ వేణు ఉడుగుల తీసిన సినిమా ఇది..సాయి పల్లవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు.. ఇలాంటి కథలు నిర్మించే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు.. ఇది మహిళల చిత్రం. సాంకేతిక నిపుణులు చాలా బాగా పనిచేశారు.. ప్రియమణి, నవీన్ చంద్ర అద్భుతమైన పాత్రలు చేశారు.. నా అభిమానులకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను.. నాకేప్పుడు విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు ఉంటారని అనుకున్నాను.. నాకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారని అనుకోలేదు.. నాకు సినిమాలు నచ్చి.. కొత్త కొత్త కథలు చెప్పాలని అనుకుంటూ సినిమాలు చేస్తూ వెళ్లాను.. కానీ విరాటపర్వం సినిమా తీసిన తర్వాత ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలిసింది. ఇక నుంచి ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయను.. పిచ్చేక్కిద్దాం” అంటూ చెప్పుకొచ్చారు రానా.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.