AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita: ఆ ప్రాంతంలో గడిపిన ప్రతి రోజూ విలువైనదే.. విహార యాత్ర ఫొటోలను షేర్‌ చేసిన చిరు కూతురు. ఆ ప్లేస్‌ ఏంటంటే..

Sushmita Konidela: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే మళ్లీ కంట్రోల్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా నమోదవుతోన్న కరోనా కేసుల...

Sushmita: ఆ ప్రాంతంలో గడిపిన ప్రతి రోజూ విలువైనదే.. విహార యాత్ర ఫొటోలను షేర్‌ చేసిన చిరు కూతురు. ఆ ప్లేస్‌ ఏంటంటే..
Sushma Konidela
Narender Vaitla
|

Updated on: Jul 17, 2021 | 10:20 AM

Share

Sushmita Konidela: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే మళ్లీ కంట్రోల్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా నమోదవుతోన్న కరోనా కేసుల సంఖ్య తగ్గడం, మరణాలు కూడా గతంతో పోలీస్తే భారీగా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్లీ థార్డ్‌ వస్తుందనే ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రభుత్వాలు నిబంధనలను ఎత్తి వేస్తున్నాయి. రైలు, విమాన, హోటల్‌ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.

దీంతో కరోనా సమయంలో కేవలం ఇంటికే పరిమితమైన వారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు రెక్కలు కట్టుకొని విహార ప్రదేశాల్లో వాలిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా స్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కూడా విహార యాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. టూర్‌లో భాగంగా సుష్మిత.. లడఖ్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆమె సందర్శించిన లడఖ్‌, పాంగాంగ్‌ సరస్సు, లెహ్‌ ప్రాంతాల్లో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. టూర్‌ ముగించుకొని ఇంటికి చేరుకున్న తర్వాత ఫొటోలను పోస్ట్‌ చేసిన సుష్మిత.. ‘అద్భుత ప్రదేశం నుంచి ఇప్పుడే తిరిగొచ్చాం. ఆ ప్రాంతం అందాన్ని వర్ణించడానికి ఈ ఫొటోలు సరిపోవు. అది కఠినమైన భూభాగమే అయినప్పటికీ అక్కడ గడిపిన ప్రతి రోజూ విలువైనదే’ అంటూ క్యాప్షన్‌ జోడించింది.

View this post on Instagram

A post shared by Sushmita (@sushmitakonidela)

ఇక సుష్మిత కెరీర్‌ విషయానికొస్తే.. చిరంజీవి కూతురుగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. గతంలో పలు సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన సుష్మిత ఇటీవల నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇక తమిళంలో విజయవంతమైన ‘ఆ తూట్టాక్కళ్‌’ అనే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి సుష్మిత ప్లాన్‌ చేస్తోందని వార్తలు వచ్చాయి.

Also Read: Katrina Kaif: రెడ్‌ స్విమ్‌ సూట్‌లో అందాల కత్రీనా.. అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ.. సర్‌ప్రైజ్‌ ఫొటో..

కొడుకు సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టిన కింగ్.. అఖిల్ ఏజెంట్ కోసం రంగంలోకి నాగార్జున

Priyamani: సెకండ్ ఇన్నింగ్స్‌లో తన సూపర్‌ సక్సెస్‌‌కు సీక్రెట్‌ ఏంటో చెప్పిన ప్రియమణి