Tollywood: రొమాంటిక్ చిత్రాలు, ముద్దు సీన్ల రచ్చ.. కట్ చేస్తే.. 20 ఏళ్లల్లో రెండే హిట్లు.. రూ.170 కోట్ల ఆస్తులు..
2002లో సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ నటి. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఎక్కువగా స్పెషల్ పాటలతోనే ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు స్పెషల్ పాటలు, రొమాంటిక్ చిత్రాలతోనే ఫేమస్ అయ్యింది. చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు..ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.

భారతీయ సినీపరిశ్రమలోకి చాలా మంది నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈ కలల రంగుల ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. నార్త్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిన ఈ నటి.. ఒకప్పుడు రొమాంటిక్ చిత్రాలతో ఇండస్ట్రీని ఏలేసింది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె ఆ తర్వాత స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీని ఏలేసిన ఆమె.. ఇప్పుడు లాస్ ఏంజిల్స్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఇమ్రాన్ హష్మీతో ఆమె చేసిన చిత్రం బాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మల్లికా షెరావత్ గురించి. మర్డర్ చిత్రంలో ఇమ్రాన్ హష్మీతో తన బోల్డ్ సన్నివేశాలతో మల్లిక బాలీవుడ్లో సంచలనం సృష్టించింది. కెరీర్ మొత్తంలో తన నటనతో ప్రశంసలు అందుకుంది.
కానీ ఎక్కువగా వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన కారణాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఆమె పరిశ్రమలో అత్యంత బహిరంగంగా మాట్లాడే నటీమణులలో ఒకరు. ఆమె ప్రయాణం ఎప్పుడూ ఇంత గ్లామరస్గా లేదు. మల్లికా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ఆమె ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కానీ తల్లిదండ్రులను కాదనుకుని ముంబై వెళ్లిపోయింది. ఒక చిన్న పాత్రతో ప్రారంభించి క్రమంగా బాలీవుడ్లో స్థిరపడింది. తన కుటుంబం తిరస్కరించడం నుండి హాలీవుడ్లో తనకంటూ ఒక పేరును ఏర్పరచుకోవడం వరకు ప్రతి సవాలు ఎదుర్కోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మర్డర్ సినిమా మల్లికా షెరావత్ను రాత్రికి రాత్రే స్టార్ను చేసింది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీతో బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. అలాగే భారీగా వసూళ్లు రాబట్టింది.
మల్లికా హాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. ఆమె జాకీ చాన్తో కలిసి ది మిత్ చిత్రంలో నటించింది. ఆమె 2010 హాలీవుడ్ చిత్రం హిస్స్లో కూడా నటించింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న మల్లికా.. ఇటీవల విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాజ్ కుమార్ రావు, త్రిప్తి దిమ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :




